Shashi Tharoor: పార్లమెంటులో ఉద్రిక్త చర్చకు రంగం సిద్ధం.. శశిథరూర్ మౌనం వీడతారా?

Shashi Tharoor to Break Silence in Parliament Debate
షార్ట్స్‌లో చూడండి
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వారం రోజుల పాటు నెలకొన్న అనిశ్చితి, అడ్డంకులకు తెరదించుతూ నేటి నుంచి లోక్‌సభ, రాజ్యసభల్లో పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చ ప్రారంభం కానుంది. ఈ చర్చలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పాల్గొంటారా లేదా అనే అంశం ఆసక్తిగా మారింది. భారత్-పాకిస్థాన్ ఘర్షణ సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందాల్లో ఒకదానికి నాయకత్వం వహించిన శశిథరూర్ అమెరికా సహా ఇతర దేశాల్లో పర్యటించారు. ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరికి విరుద్ధంగా ఉండటంతో పార్టీతో విభేదాలు మొదలయ్యాయి.

శశిథరూర్ గైర్హాజరీపై ఊహాగానాలు
కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం శశిథరూర్ ఈ చర్చలో మాట్లాడే అవకాశం లేదు. "చర్చలో పాల్గొనాలనుకునే ఎంపీలు తమ అభ్యర్థనలను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) కార్యాలయానికి పంపాలి. కానీ శశిథరూర్ ఇప్పటివరకు అలాంటి అభ్యర్థన పంపలేదు" అని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే, తిరువనంతపురం ఎంపీ అయిన థరూర్ ఈ కీలక చర్చను దాటవేస్తే పార్టీతో ఆయన విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. థరూర్ ప్రభుత్వ వైఖరిని, కాల్పుల విరమణను బహిరంగంగా సమర్థించడం, ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న కాంగ్రెస్ సహచరులతో విభేదాలకు దారితీసింది. 
Go Back to Shorts
Shashi Tharoor
Parliament
Pahalgam Terrorist Attack
Operation Sindoor
India Pakistan Conflict
Congress Party
Monsoon Session
Lok Sabha
Rajya Sabha
Indian Politics

More Telugu News