Ben Stokes: స్టోక్స్ సెంచరీ... తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 669 ఆలౌట్... టీమిండియా ముందు అగ్నిపరీక్ష
- ఓల్డ్ ట్రాఫర్డ్ లో భారత్-ఇంగ్లండ్ నాలుగో టెస్టు
- పరుగుల పండుగ చేసుకున్న ఇంగ్లండ్ బ్యాటర్లు
- నిన్న రూట్ సెంచరీ... నేడు స్టోక్స్ సెంచరీ
- తేలిపోయిన భారత బౌలర్లు
మాంచెస్టర్లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ పట్టు బిగించింది. ఇంగ్లండ్ 669 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. తద్వారా కీలకమైన 311 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 358 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ హైలైట్స్: తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. జాక్ క్రాలీ (84), బెన్ డకెట్ (94) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఓలీ పోప్ (71) కూడా రాణించాడు. మూడో రోజు ఆటలో జో రూట్ (150) సెంచరీ హైలైట్ కాగా, నాలుగో రోజు ఆటలో కెప్టెన్ బెన్ స్టోక్స్ (141) సెంచరీ మెరుపులు అందరినీ అలరించాయి. చివర్లో బ్రైడెన్ కార్స్ కూడా దూకుడుగా ఆడడంతో ఇంగ్లండ్ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. కార్స్ 54 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 47 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బ్యాటర్ల విజృంభణ ముందు భారత బౌలర్లు తేలిపోయారు. బుమ్రా, సిరాజ్ వంటి సీనియర్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా, శార్దూల్ ఠాకూర్ ఒక్క వికెట్టు కూడా తీయలేకపోయాడు.
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అన్షుల్ కంబోజ్, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 311 పరుగుల భారీ ఆధిక్యంలో ఉండటంతో, భారత్ ఈ మ్యాచ్లో నిలబడాలంటే అద్భుతాలు చేయాల్సి ఉంటుంది.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ హైలైట్స్: తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. జాక్ క్రాలీ (84), బెన్ డకెట్ (94) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఓలీ పోప్ (71) కూడా రాణించాడు. మూడో రోజు ఆటలో జో రూట్ (150) సెంచరీ హైలైట్ కాగా, నాలుగో రోజు ఆటలో కెప్టెన్ బెన్ స్టోక్స్ (141) సెంచరీ మెరుపులు అందరినీ అలరించాయి. చివర్లో బ్రైడెన్ కార్స్ కూడా దూకుడుగా ఆడడంతో ఇంగ్లండ్ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. కార్స్ 54 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 47 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బ్యాటర్ల విజృంభణ ముందు భారత బౌలర్లు తేలిపోయారు. బుమ్రా, సిరాజ్ వంటి సీనియర్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా, శార్దూల్ ఠాకూర్ ఒక్క వికెట్టు కూడా తీయలేకపోయాడు.
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అన్షుల్ కంబోజ్, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 311 పరుగుల భారీ ఆధిక్యంలో ఉండటంతో, భారత్ ఈ మ్యాచ్లో నిలబడాలంటే అద్భుతాలు చేయాల్సి ఉంటుంది.