కర్ణాటకలోనూ కులగణన.. ఈసారి మొబైల్ యాప్తో సర్వే
- సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 7 వరకు 15 రోజులపాటు సర్వే
- సర్వేలో పాల్గొననున్న 1.65 లక్షల మంది ఎన్యుమరేటర్లు
- రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించనున్న సర్వే నివేదిక
సర్వే లక్ష్యం.. నూతన విధానం
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన నిన్న జరిగిన సన్నాహక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. "కుల వివక్షను నిర్మూలించడమే ఈ సర్వే ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలోని 7 కోట్ల మంది ప్రజలను కవర్ చేసే ఈ సర్వే దేశానికి ఆదర్శంగా నిలవాలి" అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఈ సర్వేలో వ్యక్తుల ఆర్థిక స్థితి, భూమి యాజమాన్యం, సామాజిక గుర్తింపు వంటి సమగ్ర వివరాలను సేకరిస్తారు.
2015లో నిర్వహించిన సర్వేను వొక్కలిగ, వీరశైవ-లింగాయత్ సామాజిక వర్గాలు విమర్శించాయి. దీంతో ఆ నివేదికను పక్కన పెట్టి, ఇప్పుడు కొత్త సర్వేకు శ్రీకారం చుట్టారు. గతంలో కాంతరాజు కమిషన్ 54 ప్రశ్నలతో మాన్యువల్గా సర్వే నిర్వహించగా, ఈసారి మొబైల్ యాప్ను ఉపయోగించి మరిన్ని అంశాలను చేర్చనున్నారు. సర్వేను విజయవంతం చేయడానికి 1.65 లక్షల మంది ఎన్యుమరేటర్లు, ఉపాధ్యాయులు, ఇతర శాఖల సిబ్బంది పాల్గొంటారు.