హెచ్సీఏ విషయంలో దుష్ప్రచారం చేయవద్దు: సీఐడీ అధికారిణి చారుసిన్హా
- ఓటింగ్ విషయంలో ఐఏఎస్, ఐపీఎస్లపై ప్రచారం
- ఖండించిన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు
- కేసు సంబంధిత అప్డేట్లను సీఐడీ అధికారికంగా విడుదల చేస్తుందని వెల్లడి
హెచ్సీఏ కేసులో అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈవో సునీల్, అధికారి రాజేందర్ యాదవ్, ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు ఉన్నాయి. వీరంతా 23 ఇన్ స్టిట్యూషనల్ ఓట్లను అక్రమంగా వేయించినట్లు సీఐడీ గుర్తించింది. అయితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఓటింగులో పాల్గొన్నారన్న ఆరోపణలను చారుసిన్హా ఖండించారు.