Malayappa Swamy: మలయప్ప స్వామికి మైసూరు సంస్థానం ఆతిథ్యం
- తిరుమలలో ఘనంగా శ్రీవారి పల్లవోత్సవం
- కర్ణాటక సత్రం వద్ద స్వామివారికి స్వాగతం పలికిన మైసూర్ సంస్థానం ప్రతినిధులు
- టీటీడీ చైర్మన్ కు జ్ఞాపికను అందజేసిన మైసూర్ మహారాణి ప్రమోదాదేవి
తిరుమలలో శ్రీవారి పల్లవోత్సవం నిన్న వైభవంగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టీటీడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేశారు.
అక్కడ మైసూరు సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు మైసూరు సంస్థాన ప్రతినిధులు ఆహ్వానం పలికి, ప్రత్యేక హారతి సమర్పించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడును మైసూర్ మహారాణి ప్రమోదాదేవి సత్కరించి, సంస్థానం జ్ఞాపికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మైసూర్ సంస్థానం మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడియార్, టీటీడీ బోర్డు సభ్యులు నరేశ్, జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
అక్కడ మైసూరు సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు మైసూరు సంస్థాన ప్రతినిధులు ఆహ్వానం పలికి, ప్రత్యేక హారతి సమర్పించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడును మైసూర్ మహారాణి ప్రమోదాదేవి సత్కరించి, సంస్థానం జ్ఞాపికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మైసూర్ సంస్థానం మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడియార్, టీటీడీ బోర్డు సభ్యులు నరేశ్, జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.