Pawan Kalyan: నా గుండె కొట్టుకునేది మీ కోసమే: 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్
- హైదరాబాదులో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఎమోషనల్ స్పీచ్ ఇచ్చిన పవన్ కల్యాణ్
- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి థ్యాంక్స్ చెప్పిన పవన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన పాన్-ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ తన సినీ ప్రస్థానం, చిత్రం గురించి హృదయస్పర్శిగా మాట్లాడారు. ఈ చిత్రం జులై 24న విడుదల కానుంది. పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతి ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. పోలీసులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానని వెల్లడించారు.
“సినిమా రంగం నాకు అన్నీ ఇచ్చింది. సమాజంలో ఎన్ని తేడాలు ఉన్నా, సినిమా అందరినీ ఒక్కటి చేస్తుంది. ఈ చిత్రం కోసం చాలా సవాళ్లను ఎదుర్కొన్నాం. రెండు కోవిడ్ వేవ్లు, ఆర్థిక సమస్యలు, సృజనాత్మక ఒడిదొడుకులు వచ్చాయి. నా రాజకీయ బాధ్యతల కారణంగా కొంత సమయం ఇవ్వలేకపోయాను. అయినా, నిర్మాత ఏ.ఎం. రత్నం గారి నమ్మకం, ఆయన నిబద్ధత నన్ను ఈ ప్రాజెక్ట్లో ఉంచాయి” అని చెప్పారు.
ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, “17వ శతాబ్దంలో మొగల్ సామ్రాజ్య నేపథ్యంలో ఈ చిత్రం ఒక కల్పిత యోధుడి కథ. నేను చేసిన ఒక 20 నిమిషాల యాక్షన్ సన్నివేశం కథను మలుపు తిప్పేలా ఉంటుంది. దీనికి ఎం.ఎం. కీరవాణి గారు 10 రోజులు సంగీతం సమకూర్చారు” అని పవన్ వెల్లడించారు.
నిర్మాత ఏ.ఎం. రత్నంపై ప్రశంసలు కురిపిస్తూ, “రత్నం గారు తెలుగు సినిమా నాణ్యతను జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఈ చిత్రం కోసం ఆయన చూపిన చిత్తశుద్ధి నన్ను కట్టిపడేసింది. అందుకే ఈ ప్రెస్ మీట్కు వచ్చాను” అని పవన్ తెలిపారు.
ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో కనిపించనున్నారు. “బాబీ డియోల్ చాలా అద్భుతంగా నటించారు. ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది” అని పవన్ పేర్కొన్నారు.
"నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓ మంచి మిత్రుడు లభించాడు... ఆయనే కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే. గతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. భీమ్లానాయక్ సినిమా టైమ్ లో అన్ని సినిమాలకు టికెట్లు రూ.100, ఆపైన ఉంటే నా సినిమా టికెట్ ను రూ.10, 15కి అమ్మారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనల్ని ఎవడ్రా ఆపేది అని చెప్పాను. నేనెప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నించలేదు. సగటు మనిషిగా బతకడం ఒక్కటే నా కోరిక. నా గుండె మీ (ఫ్యాన్స్) గురించే కొట్టుకుంటుంది.
ఈ సందర్భంగా త్రివిక్రమ్ గురించి చెప్పాలి. చాలామంది మనం బాగున్నప్పుడే దగ్గరకు వస్తుంటారు. కానీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి, నాకు హిట్ ఇచ్చిన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. నేను ఫ్లాప్ లు ఇస్తున్న సమయంలో కూడా ఆయన నాతో జల్సా సినిమా చేసి హిట్ ఇచ్చారు. ఆ సినిమాకు ముందు నాకు త్రివిక్రమ్ గురించి తెలియదు. నేను రీమేక్ లు చేయడానికి బలమైన కారణం ఉంది. నా నిర్మాత బాగుండాలి... సినిమా ఫ్లాప్ అయితే అందరం ఇబ్బంది పడతాం... అంతేతప్ప నేను కొత్త సినిమాలు చేయలేక కాదు. ఇక హరిహర వీరమల్లు చిత్రంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ కు దర్శకత్వం వహించాను. మీరు కోరుకుంటున్నట్టే నేను కూడా సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా... ఈ చిత్రం ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చెప్పలేను... ఈ సినిమా మీకు నచ్చితే బాక్సాఫీసును బద్దలు కొట్టేయండి" అని పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో పిలుపునిచ్చారు.
స్టోరీ లైన్ చెప్పిన పవన్
"ఏపీలోని కొల్లూరులో కోహినూర్ డైమండ్ దొరికింది. అది అనేక చేతులు మారి బ్రిటన్ మ్యూజియంలోకి చేరింది. దర్శకుడు క్రిష్ చెప్పిన ఈ సినిమా లైన్ నాకు బాగా నచ్చింది. చరిత్ర చూస్తే భారతదేశం ఎవరిపైనా దాడి చేయలేదు... మనపైనే అందరూ దాడి చేశారు. మొఘల్ చక్రవరి ఔరంగజేబు అకృత్యాల గురించి ఎవరూ చెప్పలేదు. హిందువుగా బతకాలంటే కూడా పన్ను కట్టాల్సిన రోజుల్లో ఛత్రపతి శివాజీ వీరోచితంగా పోరాడారు. ఆ తరహాలోనే ధర్మం కోసం పోరాడిన వ్యక్తి కథే హరిహర వీరమల్లు..." అని పవన్ వివరించారు.
దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, “పవన్ గారి కలలోని వీరమల్లు మా ఊహకు అందనంత శక్తివంతమైన పాత్ర. ఈ చిత్రం కోసం రోజూ అంకితభావంతో పనిచేశాం” అని చెప్పారు. నటి నిధి అగర్వాల్ మాట్లాడుతూ, “పవన్ గారితో నటించడం నా కెరీర్లో పెద్ద అవకాశం. ఈ చిత్రం మీ అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా” అని అన్నారు.
ఈ చిత్రం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏ.ఎం. రత్నం, ఎ. దయాకర్ రావు నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
“సినిమా రంగం నాకు అన్నీ ఇచ్చింది. సమాజంలో ఎన్ని తేడాలు ఉన్నా, సినిమా అందరినీ ఒక్కటి చేస్తుంది. ఈ చిత్రం కోసం చాలా సవాళ్లను ఎదుర్కొన్నాం. రెండు కోవిడ్ వేవ్లు, ఆర్థిక సమస్యలు, సృజనాత్మక ఒడిదొడుకులు వచ్చాయి. నా రాజకీయ బాధ్యతల కారణంగా కొంత సమయం ఇవ్వలేకపోయాను. అయినా, నిర్మాత ఏ.ఎం. రత్నం గారి నమ్మకం, ఆయన నిబద్ధత నన్ను ఈ ప్రాజెక్ట్లో ఉంచాయి” అని చెప్పారు.
ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, “17వ శతాబ్దంలో మొగల్ సామ్రాజ్య నేపథ్యంలో ఈ చిత్రం ఒక కల్పిత యోధుడి కథ. నేను చేసిన ఒక 20 నిమిషాల యాక్షన్ సన్నివేశం కథను మలుపు తిప్పేలా ఉంటుంది. దీనికి ఎం.ఎం. కీరవాణి గారు 10 రోజులు సంగీతం సమకూర్చారు” అని పవన్ వెల్లడించారు.
నిర్మాత ఏ.ఎం. రత్నంపై ప్రశంసలు కురిపిస్తూ, “రత్నం గారు తెలుగు సినిమా నాణ్యతను జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఈ చిత్రం కోసం ఆయన చూపిన చిత్తశుద్ధి నన్ను కట్టిపడేసింది. అందుకే ఈ ప్రెస్ మీట్కు వచ్చాను” అని పవన్ తెలిపారు.
ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో కనిపించనున్నారు. “బాబీ డియోల్ చాలా అద్భుతంగా నటించారు. ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది” అని పవన్ పేర్కొన్నారు.
"నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఓ మంచి మిత్రుడు లభించాడు... ఆయనే కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే. గతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. భీమ్లానాయక్ సినిమా టైమ్ లో అన్ని సినిమాలకు టికెట్లు రూ.100, ఆపైన ఉంటే నా సినిమా టికెట్ ను రూ.10, 15కి అమ్మారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనల్ని ఎవడ్రా ఆపేది అని చెప్పాను. నేనెప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నించలేదు. సగటు మనిషిగా బతకడం ఒక్కటే నా కోరిక. నా గుండె మీ (ఫ్యాన్స్) గురించే కొట్టుకుంటుంది.
ఈ సందర్భంగా త్రివిక్రమ్ గురించి చెప్పాలి. చాలామంది మనం బాగున్నప్పుడే దగ్గరకు వస్తుంటారు. కానీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి, నాకు హిట్ ఇచ్చిన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. నేను ఫ్లాప్ లు ఇస్తున్న సమయంలో కూడా ఆయన నాతో జల్సా సినిమా చేసి హిట్ ఇచ్చారు. ఆ సినిమాకు ముందు నాకు త్రివిక్రమ్ గురించి తెలియదు. నేను రీమేక్ లు చేయడానికి బలమైన కారణం ఉంది. నా నిర్మాత బాగుండాలి... సినిమా ఫ్లాప్ అయితే అందరం ఇబ్బంది పడతాం... అంతేతప్ప నేను కొత్త సినిమాలు చేయలేక కాదు. ఇక హరిహర వీరమల్లు చిత్రంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ కు దర్శకత్వం వహించాను. మీరు కోరుకుంటున్నట్టే నేను కూడా సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా... ఈ చిత్రం ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చెప్పలేను... ఈ సినిమా మీకు నచ్చితే బాక్సాఫీసును బద్దలు కొట్టేయండి" అని పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో పిలుపునిచ్చారు.
స్టోరీ లైన్ చెప్పిన పవన్
"ఏపీలోని కొల్లూరులో కోహినూర్ డైమండ్ దొరికింది. అది అనేక చేతులు మారి బ్రిటన్ మ్యూజియంలోకి చేరింది. దర్శకుడు క్రిష్ చెప్పిన ఈ సినిమా లైన్ నాకు బాగా నచ్చింది. చరిత్ర చూస్తే భారతదేశం ఎవరిపైనా దాడి చేయలేదు... మనపైనే అందరూ దాడి చేశారు. మొఘల్ చక్రవరి ఔరంగజేబు అకృత్యాల గురించి ఎవరూ చెప్పలేదు. హిందువుగా బతకాలంటే కూడా పన్ను కట్టాల్సిన రోజుల్లో ఛత్రపతి శివాజీ వీరోచితంగా పోరాడారు. ఆ తరహాలోనే ధర్మం కోసం పోరాడిన వ్యక్తి కథే హరిహర వీరమల్లు..." అని పవన్ వివరించారు.
దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, “పవన్ గారి కలలోని వీరమల్లు మా ఊహకు అందనంత శక్తివంతమైన పాత్ర. ఈ చిత్రం కోసం రోజూ అంకితభావంతో పనిచేశాం” అని చెప్పారు. నటి నిధి అగర్వాల్ మాట్లాడుతూ, “పవన్ గారితో నటించడం నా కెరీర్లో పెద్ద అవకాశం. ఈ చిత్రం మీ అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా” అని అన్నారు.
ఈ చిత్రం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏ.ఎం. రత్నం, ఎ. దయాకర్ రావు నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.