అసెంబ్లీలో రమ్మీ ఆడుతున్న వ్యవసాయ మంత్రి.. వీడియో ఇదిగో!
- మహారాష్ట్ర మంత్రి నిర్వాకాన్ని బయటపెట్టిన ఎన్సీపీ లీడర్
- రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మంత్రికి పట్టడంలేదని ఆగ్రహం
- అప్పుడప్పుడైనా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకోవాలంటూ హితవు
ఈ సమస్యలతో అప్పులపాలైన రైతులు సగటున రోజుకు ఎనిమిది మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారని రోహిత్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ వ్యవసాయ మంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా అసెంబ్లీలోనే ఫోన్ లో రమ్మీ ఆడుకుంటూ కూర్చున్నాడని మండిపడ్డారు. మొబైల్ ఫోన్ లో రమ్మీ ఆటను పక్కన పెట్టి అప్పుడప్పుడైనా పంట పొలాల్లోకి వచ్చి రైతుల సమస్యలను అడిగి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.