Nara Lokesh: ధన్యవాదాలు ఆనంద్ మహీంద్రా గారూ... మనం కలిసి పనిచేద్దాం: మంత్రి నారా లోకేశ్
- లోకేశ్, ఆనంద్ మధ్య ట్వీట్ల సంభాషణ
- ఏపీలో పెట్టుబడులకు చర్చలు జరుగుతున్నాయన్న ఆనంద్ మహీంద్రా
- మరింతగా విస్తరించాలంటూ లోకేశ్ ఆకాంక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను మరింతగా విస్తరించాలని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ఆహ్వానించారు. మహీంద్రా గ్రూప్ యొక్క ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), రక్షణ, మరియు ఏరోస్పేస్ తయారీ రంగాల్లో విస్తరణ ప్రణాళికల గురించి తెలుసుకున్నట్లు లోకేశ్ తెలిపారు.
ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ, "ధన్యవాదాలు ఆనంద్ మహీంద్ర గారు! మనం కలిసి పనిచేద్దాం. ఆంధ్రప్రదేశ్లో మీ నిరంతర పెట్టుబడులను మేము గౌరవిస్తున్నాము. ఈవీ, రక్షణ, ఏరోస్పేస్ తయారీ రంగాల్లో మీ విస్తరణకు ఏపీలో అనుకూలమైన విధానాలు, గరిష్ట ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయి. మా రాష్ట్రంలో తయారీ యూనిట్ల స్థాపనను పరిశీలిస్తే సంతోషిస్తాము. మా వేగం, విధానంతో మిమ్మల్ని ఆకట్టుకుంటామని హామీ ఇస్తున్నాము. మీ ఉద్యోగులు ఇక్కడ స్వాగతం పొందుతారు మరియు వారు కోరుకున్న భాషలో మాట్లాడవచ్చు" అని లోకేశ్ పేర్కొన్నారు. తన ట్వీట్లో "భిన్నత్వంలో ఏకత్వం" అనే సందేశంతో ఆంధ్రప్రదేశ్ యొక్క వైవిధ్యభరిత వాతావరణాన్ని, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను హైలైట్ చేశారు.
నిన్న ఆనంద్ మహీంద్రా తమ ఫ్యూరియో-8 ట్రక్కుల తెలుగు యాడ్ ను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ యాడ్ ను లోకేశ్ లైక్ చేశారు. అప్పటి నుంచి ఆనంద్ మహీంద్రా, లోకేశ్ మధ్య ట్వీట్ల సంభాషణ కొనసాగుతోంది.
ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ, "ధన్యవాదాలు ఆనంద్ మహీంద్ర గారు! మనం కలిసి పనిచేద్దాం. ఆంధ్రప్రదేశ్లో మీ నిరంతర పెట్టుబడులను మేము గౌరవిస్తున్నాము. ఈవీ, రక్షణ, ఏరోస్పేస్ తయారీ రంగాల్లో మీ విస్తరణకు ఏపీలో అనుకూలమైన విధానాలు, గరిష్ట ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయి. మా రాష్ట్రంలో తయారీ యూనిట్ల స్థాపనను పరిశీలిస్తే సంతోషిస్తాము. మా వేగం, విధానంతో మిమ్మల్ని ఆకట్టుకుంటామని హామీ ఇస్తున్నాము. మీ ఉద్యోగులు ఇక్కడ స్వాగతం పొందుతారు మరియు వారు కోరుకున్న భాషలో మాట్లాడవచ్చు" అని లోకేశ్ పేర్కొన్నారు. తన ట్వీట్లో "భిన్నత్వంలో ఏకత్వం" అనే సందేశంతో ఆంధ్రప్రదేశ్ యొక్క వైవిధ్యభరిత వాతావరణాన్ని, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను హైలైట్ చేశారు.
నిన్న ఆనంద్ మహీంద్రా తమ ఫ్యూరియో-8 ట్రక్కుల తెలుగు యాడ్ ను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ యాడ్ ను లోకేశ్ లైక్ చేశారు. అప్పటి నుంచి ఆనంద్ మహీంద్రా, లోకేశ్ మధ్య ట్వీట్ల సంభాషణ కొనసాగుతోంది.