మీకేం తెలుసు? జగన్ ను ప్రశ్నిస్తూ పొగాకు రైతుల లేఖ
- సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు వచ్చాయంటున్న రైతులు
- పొగాకు సాగు చేయని వారిని బాధితులుగా చూపిస్తున్నారంటూ ఆవేదన
- జగన్ కు పొగాకు రైతుల కష్టాలు తెలుసా అంటూ ప్రశ్న
తప్పుడు వార్తలతో రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీసే కథనాలు రాయొద్దని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం తమ కోసం రూ.273 కోట్లు కేటాయించిందని... పర్చూరు, చిలకలూరిపేట, ప్రత్తిపాడు, అద్దంకి నియోజకవర్గ రైతుల కోసం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని రైతులు ఆ లేఖలో స్పష్టం చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే, సాక్షిలో అసత్య కథనాలు రాస్తూ రైతులను ఆయోమయానికి గురిచేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు.