ఏపీలో 66 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామకం... పూర్తి జాబితా ఇదిగో!

AP Agriculture Market Committees Chairmans Appointed
  • ఏఎంసీ నియాకమాలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
  • టీడీపీ నుంచి 53, జనసేన నుంచి 9 మంది, బీజేపీ నుంచి నలుగురికి చాన్స్
  • సామాజిక సమీకరణాలు అనుసరించి కూటమి సర్కారు నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్‌ కమిటీల (ఏఎంసీ) నియామకాలపై కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 66 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు చైర్మన్‌లను ఖరారు చేసింది. ఈ నియామకాల్లో టీడీపీ నుంచి 53 మంది, జనసేన పార్టీ నుంచి 9 మంది, బీజేపీ నుంచి నలుగురు చైర్మన్‌లుగా అవకాశం పొందారు.


ఈ 66 చైర్మన్‌ పదవుల్లో సామాజిక వర్గాల ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. బీసీ సామాజిక వర్గాల నుంచి 17 మంది, షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) నుంచి 10 మంది, షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ) నుంచి ఐదుగురు, మైనారిటీల నుంచి ఐదుగురు చైర్మన్‌లుగా నియమితులయ్యారు. ఈ నియామకాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలను బలోపేతం చేయడంతో పాటు, స్థానిక నాయకత్వానికి అవకాశం కల్పించే లక్ష్యంతో జరిగాయి.


ఈ చైర్మన్‌ల నియామకం ద్వారా వ్యవసాయ రంగంలో సమర్థవంతమైన నిర్వహణ, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.

Go Back to Shorts
AP Agriculture Market Committees
Andhra Pradesh
TDP
Janasena
BJP
AMC Chairmans
AP News
Political Appointments
Agriculture Sector
Farmers Welfare

More Telugu News