Chandrababu Naidu: హస్తినలో ముగిసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

Telugu States CMs Meeting Concludes
  • జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం
  • దాదాపు గంటన్నర పాటు సమావేశం
  • కేంద్రం ఎదుట వాదనలు వినిపించిన ఇరు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్రమంత్రి సమావేశమయ్యారు.

గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానం సింగిల్ పాయింట్ ఎజెండాగా ఆంధ్రప్రదేశ్.. 13 అంశాలతో తెలంగాణ ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఇరు రాష్ట్రాలు తమ తమ వాదనలను కేంద్రం ముందు ఉంచాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులతో పాటు ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్లు హాజరయ్యారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Revanth Reddy
Telangana
Godavari River

More Telugu News