కోల్కతాలో వర్షంలో నిరసన తెలిపిన మమతా బెనర్జీ
- బెంగాల్ భారతదేశ స్వేచ్ఛ కోసం పోరాడిందన్న మమతా బెనర్జీ
- బీజేపీ ఏమనుకుంటోందని నిలదీసిన బెంగాల్ ముఖ్యమంత్రి
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శ
"అసలు బీజేపీ ఏమనుకుంటోంది? బెంగాలీలను బాధపెడతారా? వారిని రోహింగ్యాలు అని పిలుస్తున్నారు. రోహింగ్యాలు ఇక్కడ కాదు, మయన్మార్లో ఉన్నారు. 22 లక్షల మంది పేద వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారు స్వదేశానికి తిరిగి రావాలని నేను వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. వారు ఇక్కడ సురక్షితంగా ఉంటారు. బీజేపీ బెంగాలీ మాట్లాడే వారిని నిర్బంధ శిబిరాలకు పంపుతోంది. పశ్చిమ బెంగాల్ భారతదేశంలో లేదా?" అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. బెంగాలీల త్యాగం, స్వాతంత్ర్య సమరయోధులను బీజేపీ మరచిపోయిందా అని ఆమె నిలదీశారు.