కశ్యప్తో విడాకులు నిజమే.. నిర్ధారించిన సైనా నెహ్వాల్
- ఏడేళ్ల వివాహ బంధానికి సైనా-కశ్యప్ ఫుల్స్టాప్
- ఇన్స్టా పోస్టుతో నిర్ధారించిన సైనా నెహ్వాల్
- తమ గోప్యతను గౌరవించాలని సూచన
- 2018లో పెళ్లి చేసుకున్న జంట
బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ సమయంలో మొదలైన సైనా-కశ్యప్ స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. దీంతో 2018లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. మాజీ వరల్డ్ నంబర్ వన్, ఒలింపిక్ కాంస్య పతక విజేత అయిన సైనా నెహ్వాల్ ప్రస్తుతం గాయాల బారినపడి ఫామ్ కోల్పోయింది. 2023 జూన్లో చివరిసారి ప్రొఫెషనల్ సర్క్యూట్లో ఆడింది. తాను ఆర్థరైటిస్తో బాధపడుతున్నట్టు గతేడాది ప్రకటించింది. కాగా, కాంపిటీటివ్ బ్యాడ్మింటన్ నుంచి రిటైరైన కశ్యప్ ప్రస్తుతం కోచింగ్పై దృష్టి సారించాడు.