పేర్ని నాని వ్యాఖ్యల ద్వారా అది మరోసారి స్పష్టమయింది: బోడె ప్రసాద్
- రప్పా రప్పా ప్లకార్డును జగన్ సమర్థించారన్న బోడె ప్రసాద్
- తలలు నరికేయండని పేర్ని నాని చెబుతున్నారని మండిపాటు
- అవినీతి సొమ్ముతో పేర్ని నాని విర్రవీగుతున్నారని వ్యాఖ్య
చీకట్లో కన్నుకొడితే పనైపోవాలని, తలలు నరికేయండని పేర్ని నాని చెబుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమం ద్వారా ప్రజల మన్ననలు పొందాలని చంద్రబాబు పదేపదే చెబుతుంటారని... వైసీపీ నేతలు మాత్రం తలలు నరకండి, హత్యలు చేయండి అని చెబుతున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో విధ్వంసం, హింస ఎలా ఉందో పేర్ని నాని వ్యాఖ్యల ద్వారా మరోసారి స్పష్టమయిందని చెప్పారు. అవినీతి సొమ్ముతో నాని విర్రవీగి వ్యవహరిస్తున్నారని... గత ఎన్నికల ఫలితాలను గుర్తుంచుకోవాలని అన్నారు.