బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది.. రేవంత్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది: లక్ష్మణ్
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
- ఆర్డినెన్స్ కు గవర్నర్ ఎలా ఆమోదం తెలుపుతారన్న లక్ష్మణ్
- జనాభా గణాంకాలను బయటపెట్టాలని డిమాండ్
రిజర్వేషన్లలో వివిధ కులాలకు సంబంధించిన గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. జనాభా గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే కోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాదన నిలబడే అవకాశం ఉంటుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బుర్ర వెంకటేశం ఆధ్వర్యంలోని కమిషన్ బాధ్యతలను ఎందుకు సక్రమంగా నిర్వర్తించలేదని ప్రశ్నించారు. కులాలకు సంబంధించిన ప్రామాణిక గణాంకాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.