కుర్చీ దొరకడం అంత ఈజీ కాదు.. డీకే శివకుమార్ వ్యాఖ్య
- కుర్చీ కోసం మేం ఆరాటపడుతుంటే మీరేమో కుర్చీ దొరికినా కూర్చోవట్లేదు
- బెంగళూరు అడ్వొకేట్ల సమావేశంలో డీకే వ్యాఖ్యలు
- సీఎం కుర్చీ వివాదం నేపథ్యంలో వైరల్ గా మారిన కామెంట్స్
ఈ వివాదం ఇలా కొనసాగుతుండగా తాజాగా శుక్రవారం బెంగళూరులో అడ్వొకేట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కెంపెగౌడ జయంతి వేడుకలకు డీకే శివకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీకే మాట్లాడుతూ.. సభలో చాలా కుర్చీలు ఖాళీగానే ఉన్నప్పటికీ లాయర్ మిత్రులు కూర్చోవడంలేదని అన్నారు. కుర్చీ విలువ బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చని, ఖాళీగా కనిపిస్తే వెంటనే కూర్చోవాలని వ్యాఖ్యానించారు. తాము కుర్చీ కోసం ఎంతగానో ఆరాటపడతామని చెబుతూ మీరు మాత్రం ఇతరుల కోసం కుర్చీని త్యాగం చేస్తున్నారని చెప్పారు. దీంతో సభలో నవ్వులు విరిసాయి. కర్ణాటక సీఎం కుర్చీని దృష్టిలో పెట్టుకునే డీకే ఈ వ్యాఖ్యలు చేశారని స్పష్టంగా తెలిసిపోతోందంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.