Indian tourists: రష్యా పర్యటనకు వెళ్లిన భారతీయుల అక్రమ అరెస్టు
- మాస్కోలో 9 మంది భారతీయుల నిర్బంధం.. అమానవీయంగా ప్రవర్తించిన అధికారులు!
- చిన్న గదిలో బంధించి, ఫోన్లు తనిఖీ చేశారని బాధితుల ఆరోపణ
- నేరస్థుల్లా చూశారని బాధితుడు అమిత్ తన్వర్ ఇన్స్టాగ్రామ్లో ఆవేదన
- బాధితులను అజర్బైజాన్ మీదుగా భారత్కు తిప్పి పంపిన రష్యా
మిత్ర దేశంగా భావించే రష్యాలో భారత పర్యాటకులకు ఘోర అవమానం జరిగింది. వీసాతో పాటు అన్ని పత్రాలతో రష్యాలో పర్యటించేందుకు వెళ్లిన 9 మంది భారతీయులను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్బంధించారు. వారిపట్ల అత్యంత అమానవీయంగా ప్రవర్తిస్తూ మూడు రోజుల పాటు నరకం చూపించారు. బాధితుల్లో ఒకరైన అమిత్ తన్వర్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్లో పంచుకోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భారత్-రష్యా బంధం చాలా పటిష్టమన్నది ఒక అపోహ మాత్రమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే.. జులై 8న అమిత్ తన్వర్ మరో 11 మంది భారతీయులతో కలిసి మాస్కో విమానాశ్రయంలో దిగారు. అయితే, ముగ్గురిని మాత్రమే దేశంలోకి అనుమతించిన అధికారులు, అమిత్తో సహా 9 మందిని ఎలాంటి కారణం చెప్పకుండా అదుపులోకి తీసుకున్నారు. వారి పాస్పోర్టులు స్వాధీనం చేసుకుని, ఫోన్లు లాక్కున్నారు. ఫోన్లోని ఫొటో గ్యాలరీ, గూగుల్ సెర్చ్ హిస్టరీ, యూట్యూబ్ యాక్టివిటీని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారని తన్వర్ తెలిపారు.
అనంతరం వారిని ఓ చిన్న గదిలో బంధించి, వెనక్కి పంపిస్తున్నట్లు తెలిపారని వాపోయారు. "మమ్మల్ని నేరస్థుల్లా చూశారు. రోజుకు రెండుసార్లు మాత్రమే కొద్దిగా అన్నం, ఉడికించిన కూరగాయలు, ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. ఈ ప్రవర్తన చాలా అమానుషంగా ఉంది," అని అమిత్ వివరించారు. సొంత ఖర్చులతో టికెట్లు బుక్ చేసుకుంటామని చెప్పినా అధికారులు అంగీకరించలేదని, వారిని అజర్బైజాన్లోని బాకు మీదుగా చిన్న చిన్న బృందాలుగా వెనక్కి పంపారని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, మాస్కోలోని భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. గురువారం తెల్లవారుజామున తాను ముంబైకి చేరుకున్నట్లు అమిత్ తన్వర్ తన పోస్టులో తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. జులై 8న అమిత్ తన్వర్ మరో 11 మంది భారతీయులతో కలిసి మాస్కో విమానాశ్రయంలో దిగారు. అయితే, ముగ్గురిని మాత్రమే దేశంలోకి అనుమతించిన అధికారులు, అమిత్తో సహా 9 మందిని ఎలాంటి కారణం చెప్పకుండా అదుపులోకి తీసుకున్నారు. వారి పాస్పోర్టులు స్వాధీనం చేసుకుని, ఫోన్లు లాక్కున్నారు. ఫోన్లోని ఫొటో గ్యాలరీ, గూగుల్ సెర్చ్ హిస్టరీ, యూట్యూబ్ యాక్టివిటీని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారని తన్వర్ తెలిపారు.
అనంతరం వారిని ఓ చిన్న గదిలో బంధించి, వెనక్కి పంపిస్తున్నట్లు తెలిపారని వాపోయారు. "మమ్మల్ని నేరస్థుల్లా చూశారు. రోజుకు రెండుసార్లు మాత్రమే కొద్దిగా అన్నం, ఉడికించిన కూరగాయలు, ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. ఈ ప్రవర్తన చాలా అమానుషంగా ఉంది," అని అమిత్ వివరించారు. సొంత ఖర్చులతో టికెట్లు బుక్ చేసుకుంటామని చెప్పినా అధికారులు అంగీకరించలేదని, వారిని అజర్బైజాన్లోని బాకు మీదుగా చిన్న చిన్న బృందాలుగా వెనక్కి పంపారని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, మాస్కోలోని భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. గురువారం తెల్లవారుజామున తాను ముంబైకి చేరుకున్నట్లు అమిత్ తన్వర్ తన పోస్టులో తెలిపారు.