Hyderabad: హైదరాబాద్‌లో ముగిసిన బాంబు స్క్వాడ్ తనిఖీలు.. ఊపిరి పీల్చుకున్న నగరవాసులు!

Hyderabad Bomb Threat Turns Out To Be Hoax
షార్ట్స్‌లో చూడండి
మంగళవారం హైదరాబాద్ నగరంలో తీవ్ర కలకలం రేగింది. నగరంలోని సిటీ సివిల్ కోర్టు, జడ్జి ఛాంబర్స్, జింఖానా క్లబ్, రాజ్‌భవన్ వంటి నాలుగు కీలక ప్రాంతాల్లో బాంబులు పెట్టామంటూ వచ్చిన ఈ-మెయిల్స్ పెను సంచలనం సృష్టించాయి. ఈ బెదిరింపులతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గంటల తరబడి సోదాలు నిర్వహించారు.

‘అబీదా అబ్దుల్లా’ అనే పేరుతో ఉన్న ఈ-మెయిల్ ఐడీ నుంచి ఈ బెదిరింపు సందేశాలు వచ్చాయి. సిటీ సివిల్ కోర్టు, జింఖానా క్లబ్‌లలో ఆర్‌డీఎక్స్, ఐఈడీ వంటి శక్తివంతమైన పేలుడు పదార్థాలు అమర్చామని, అవి కొద్దిసేపట్లో పేలిపోతాయని మెయిల్‌లో హెచ్చరించారు. దీంతో అధికారులు వెంటనే కోర్టు కార్యకలాపాలను నిలిపివేసి, న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను ప్రాంగణం నుంచి ఖాళీ చేయించారు.

సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు హుటాహుటిన బెదిరింపులు వచ్చిన అన్ని ప్రాంతాలకు చేరుకున్నాయి. సుమారు మూడు గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ఈ సోదాల్లో ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో బెదిరింపులు బూటకమని నిర్ధారించారు. దీంతో అధికారులు, నగర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బెదిరింపు మెయిల్స్ పంపిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
Hyderabad bomb threat
City Civil Court
Raj Bhavan
bomb squad
Abida Abdulla

More Telugu News