Tirupati: తిరుపతిలో ఉన్మాది దాడి... ఒకరు మృతి

Tirupati Madmans rampage kills one injures two
  • తిరుపతి కపిలతీర్థం రోడ్డులో ఓ వ్యక్తి వీరంగం
  • కత్తి, కర్రతో ముగ్గురిపై విచక్షణారహితంగా దాడి
  • ఈ ఘటనలో శేఖర్ (55) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి
  • సుబ్రహ్మణ్యం, కల్పన అనే మరో ఇద్దరికి గాయాలు
  • గంటపాటు శ్రమించి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • దాడి చేసిన వ్యక్తి తమిళనాడు వాసిగా గుర్తింపు
పుణ్యక్షేత్రమైన తిరుపతిలో సోమవారం తీవ్ర కలకలం రేగింది. ఓ ఉన్మాది నడిరోడ్డుపై కత్తి, కర్రతో బీభత్సం సృష్టించాడు. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కపిలతీర్థం రోడ్డులో ఈ దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అకస్మాత్తుగా చేతిలో కత్తి, కర్ర పట్టుకుని దారిన వెళ్తున్న వారిపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో శేఖర్ (55) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్యం, కల్పన అనే మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

దాదాపు గంటపాటు శ్రమించిన అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా గుర్తించినట్లు అలిపిరి పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నగర నడిబొడ్డున జరిగిన ఈ దాడి స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Tirupati
Tirupati attack
Kapila Theertham
Andhra Pradesh crime
Tamil Nadu
Alipiri police station
Road accident
Crime news
Murder
Insane person

More Telugu News