Revanth Reddy: సీఎం రేవంత్ చేతుల మీదుగా వన మహోత్సవం ప్రారంభం

CM Revanth Reddy Launches Vana Mahotsavam in Telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘వన మహోత్సవం’ కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 18.03 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గల వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సీఎం రేవంత్ స్వయంగా మొక్కను నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మంత్రి కొండా సురేఖ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బొటానికల్ గార్డెన్స్‌ను సందర్శించి, అక్కడ ఒక రుద్రాక్ష మొక్కను నాటారు. కార్యక్రమం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా ఆయన ఆసక్తిగా తిలకించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
Go Back to Shorts
Revanth Reddy
Telangana Vana Mahotsavam
Vana Mahotsavam
Telangana Haritha Haram
Telangana Plantation Drive
Telangana Afforestation
Konda Surekha
Rajendranagar
Botanical Garden Hyderabad
Telangana News

More Telugu News