NHAI Lawyer: పనిలేకున్నా జనం పొద్దున్నే రోడ్డెక్కడం ఎందుకు..? కోర్టులో ఎన్ హెచ్ఏఐ తరపు లాయర్ వ్యాఖ్యలు
- ఇండోర్ హైవేపై 40 గంటల ట్రాఫిక్ జామ్.. ఉక్కపోత కారణంగా ముగ్గురు మృతి
- అధికారుల నిర్లక్ష్యమేనంటూ కోర్టుకెక్కిన బాధిత కుటుంబాలు
- విచారణలో హైవే అథారిటీ తరఫు లాయర్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ హైకోర్టు
ఇండోర్- దేవాస్ హైవేపై శుక్రవారం ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. దాదాపు 40 గంటల పాటు 8 కిలోమీటర్ల మేర 4 వేల వాహనాలు నిలిచిపోయాయి. ఈ ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుల కుటుంబాలు కోర్టుకెక్కాయి. అయితే, విచారణ సందర్భంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తరఫున వాదిస్తున్న లాయర్ వింత వాదనలు వినిపించారు. "అసలు పనేమీ లేకుండా ప్రజలు అంత పొద్దున్నే ఇళ్ల నుంచి ఎందుకు బయటకు వస్తారు?" అని ఎన్హెచ్ఏఐ లాయర్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. అధికారుల బాధ్యతారాహిత్యానికి ఈ వ్యాఖ్య అద్దం పడుతోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఇండోర్-దేవాస్ హైవేపై శుక్రవారం మొదలైన ట్రాఫిక్ జామ్ దాదాపు 40 గంటల పాటు కొనసాగింది. సుమారు 8 కిలోమీటర్ల మేర 4,000 వాహనాలు నిలిచిపోయాయి. ఈ ఘటనలో కమల్ పాంచల్ (62), బలరాం పటేల్ (55), సందీప్ పటేల్ (32) అనే ముగ్గురు వ్యక్తులు తీవ్రమైన ఉక్కపోతకు గురై వాహనాల్లోనే మరణించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ దుర్ఘటనపై దేవస్కు చెందిన న్యాయవాది ఆనంద్ అధికారి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. జస్టిస్ వివేక్ రుసియా, జస్టిస్ బినోద్ కుమార్ ద్వివేదిలతో కూడిన ధర్మాసనం సోమవారం దీనిపై విచారణ చేపట్టింది. ప్రత్యామ్నాయ రహదారిని నాలుగు వారాల్లో పూర్తి చేయాలని గతంలోనే ఆదేశించినా ఎందుకు పూర్తి చేయలేదని కోర్టు ఎన్హెచ్ఏఐను ప్రశ్నించింది. క్రషర్ యూనిట్ల సమ్మె కారణంగా ఆలస్యమైందని అధికారులు చెప్పిన సమాధానంతో ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఎన్హెచ్ఏఐ, ఇండోర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్, రోడ్డు నిర్మాణ సంస్థలను ప్రతివాదులుగా చేర్చి, వారంలోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఇండోర్ కలెక్టర్ ఆశిష్ సింగ్, ఎన్హెచ్ఏఐ నిర్మించిన సర్వీస్ రోడ్డు నాసిరకంగా ఉండటం వల్లే కుంగిపోయి ట్రాఫిక్కు అంతరాయం కలిగిందని నివేదించారు. తదుపరి విచారణను కోర్టు జులై 7వ తేదీకి వాయిదా వేసింది.
వివరాల్లోకి వెళితే.. ఇండోర్-దేవాస్ హైవేపై శుక్రవారం మొదలైన ట్రాఫిక్ జామ్ దాదాపు 40 గంటల పాటు కొనసాగింది. సుమారు 8 కిలోమీటర్ల మేర 4,000 వాహనాలు నిలిచిపోయాయి. ఈ ఘటనలో కమల్ పాంచల్ (62), బలరాం పటేల్ (55), సందీప్ పటేల్ (32) అనే ముగ్గురు వ్యక్తులు తీవ్రమైన ఉక్కపోతకు గురై వాహనాల్లోనే మరణించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ దుర్ఘటనపై దేవస్కు చెందిన న్యాయవాది ఆనంద్ అధికారి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. జస్టిస్ వివేక్ రుసియా, జస్టిస్ బినోద్ కుమార్ ద్వివేదిలతో కూడిన ధర్మాసనం సోమవారం దీనిపై విచారణ చేపట్టింది. ప్రత్యామ్నాయ రహదారిని నాలుగు వారాల్లో పూర్తి చేయాలని గతంలోనే ఆదేశించినా ఎందుకు పూర్తి చేయలేదని కోర్టు ఎన్హెచ్ఏఐను ప్రశ్నించింది. క్రషర్ యూనిట్ల సమ్మె కారణంగా ఆలస్యమైందని అధికారులు చెప్పిన సమాధానంతో ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఎన్హెచ్ఏఐ, ఇండోర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్, రోడ్డు నిర్మాణ సంస్థలను ప్రతివాదులుగా చేర్చి, వారంలోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఇండోర్ కలెక్టర్ ఆశిష్ సింగ్, ఎన్హెచ్ఏఐ నిర్మించిన సర్వీస్ రోడ్డు నాసిరకంగా ఉండటం వల్లే కుంగిపోయి ట్రాఫిక్కు అంతరాయం కలిగిందని నివేదించారు. తదుపరి విచారణను కోర్టు జులై 7వ తేదీకి వాయిదా వేసింది.