AI-SATS: విమాన విషాదం వేళ... ఏఐశాట్స్ అధికారుల డీజే పార్టీ... వీడియో ఇదిగో!
- అహ్మదాబాద్ విమాన ప్రమాద విషాదం మరవకముందే అధికారుల పార్టీ
- ఏఐశాట్స్ గుర్గావ్ ఆఫీసులో ఉన్నతాధికారుల డ్యాన్సులు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్, వెల్లువెత్తిన విమర్శలు
- బాధిత కుటుంబాల ఆవేదన పట్టించుకోలేదని ఆగ్రహం
- తమ చర్య పట్ల చింతిస్తున్నామన్న ఏఐశాట్స్
దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఒకటైన ఎయిర్ ఇండియా ఏఐ171 దుర్ఘటన యావత్ దేశాన్ని శోకసంద్రంలో ముంచెత్తిన వేళ, ఎయిరిండియా శాట్స్ (ఏఐశాట్స్) ఉన్నతాధికారులు మాత్రం డీజే పార్టీలో చిందులేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అహ్మదాబాద్లో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 274 మంది ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజులకే, జూన్ 20న గుర్గావ్లోని ఎయిరిండియా శాట్స్ కార్యాలయంలో ఈ పార్టీ జరగడం గమనార్హం. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించే ఏఐశాట్స్, టాటా గ్రూప్కు చెందిన ఎయిరిండియా లిమిటెడ్ మరియు సింగపూర్కు చెందిన శాట్స్ లిమిటెడ్ సంస్థల 50-50 జాయింట్ వెంచర్. ఈ పార్టీకి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ జీఎం సంప్రీత్ కోటియన్, ఏఐశాట్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్రహం జకారియా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హాజరైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పార్టీ వీడియో, మృతుల కుటుంబ సభ్యులు మరియు విమానయాన రంగ నిపుణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
అనేక కుటుంబాలు తమ ఆత్మీయుల మృతదేహాల కోసం ఇంకా ఎదురుచూస్తున్న సమయంలో, అంత్యక్రియల చితిమంటలు చల్లారకముందే ఇలాంటి ఉత్సవాలు చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. శుక్రవారం ఉదయం (జూన్ 21) నాటికి, గుర్తించిన 220 మృతదేహాల్లో 202 మాత్రమే కుటుంబాలకు అప్పగించారు. మిగిలిన మృతదేహాలు మార్చురీలోనే ఉండగా, డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రమాదానికి గురైన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానానికి ఢిల్లీ విమానాశ్రయంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించడంతో పాటు, అహ్మదాబాద్ నుంచి లండన్ గ్యాట్విక్ వెళ్లే విమానానికి లోడ్ షీట్ తయారుచేసిన ఏఐశాట్స్, ఈ ప్రమాదంలో తన పాత్రపైనే కాకుండా, ఇప్పుడు ఈ అనుచిత ప్రవర్తనతో కూడా వివాదాల్లో చిక్కుకుంది.
ఈ ఘటనపై ఏఐశాట్స్ ప్రతినిధి స్పందిస్తూ, "సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వీడియో మా దృష్టికి వచ్చింది. దురదృష్టవశాత్తూ ఇది పూర్తిగా తప్పుడు సందర్భంలో చిత్రీకరించబడింది. ఏదిఏమైనప్పటికీ, ఇది ఎవరికైనా మానసిక క్షోభ కలిగించి ఉంటే దానికి మేము చింతిస్తున్నాము" అని ఐఏఎన్ఎస్కు తెలిపారు. అయితే, ఈ క్షమాపణ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయింది. ఇది బాధితులు, వారి కుటుంబాల పట్ల తీవ్ర అగౌరవాన్ని, కనికరం లేనితనాన్ని ప్రతిబింబిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించే ఏఐశాట్స్, టాటా గ్రూప్కు చెందిన ఎయిరిండియా లిమిటెడ్ మరియు సింగపూర్కు చెందిన శాట్స్ లిమిటెడ్ సంస్థల 50-50 జాయింట్ వెంచర్. ఈ పార్టీకి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ జీఎం సంప్రీత్ కోటియన్, ఏఐశాట్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్రహం జకారియా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ హాజరైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పార్టీ వీడియో, మృతుల కుటుంబ సభ్యులు మరియు విమానయాన రంగ నిపుణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
అనేక కుటుంబాలు తమ ఆత్మీయుల మృతదేహాల కోసం ఇంకా ఎదురుచూస్తున్న సమయంలో, అంత్యక్రియల చితిమంటలు చల్లారకముందే ఇలాంటి ఉత్సవాలు చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. శుక్రవారం ఉదయం (జూన్ 21) నాటికి, గుర్తించిన 220 మృతదేహాల్లో 202 మాత్రమే కుటుంబాలకు అప్పగించారు. మిగిలిన మృతదేహాలు మార్చురీలోనే ఉండగా, డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రమాదానికి గురైన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానానికి ఢిల్లీ విమానాశ్రయంలో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించడంతో పాటు, అహ్మదాబాద్ నుంచి లండన్ గ్యాట్విక్ వెళ్లే విమానానికి లోడ్ షీట్ తయారుచేసిన ఏఐశాట్స్, ఈ ప్రమాదంలో తన పాత్రపైనే కాకుండా, ఇప్పుడు ఈ అనుచిత ప్రవర్తనతో కూడా వివాదాల్లో చిక్కుకుంది.
ఈ ఘటనపై ఏఐశాట్స్ ప్రతినిధి స్పందిస్తూ, "సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వీడియో మా దృష్టికి వచ్చింది. దురదృష్టవశాత్తూ ఇది పూర్తిగా తప్పుడు సందర్భంలో చిత్రీకరించబడింది. ఏదిఏమైనప్పటికీ, ఇది ఎవరికైనా మానసిక క్షోభ కలిగించి ఉంటే దానికి మేము చింతిస్తున్నాము" అని ఐఏఎన్ఎస్కు తెలిపారు. అయితే, ఈ క్షమాపణ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయింది. ఇది బాధితులు, వారి కుటుంబాల పట్ల తీవ్ర అగౌరవాన్ని, కనికరం లేనితనాన్ని ప్రతిబింబిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.