Chandrababu Naidu: 'మన్ కీ బాత్' లో 'యోగాంధ్ర-2025' ప్రస్తావన... ప్రధాని మోదీకి థాంక్స్ చెప్పిన చంద్రబాబు

Chandrababu Thanks Modi for Mentioning Yoga Andhra 2025 in Man Ki Baat
  • ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమం
  • ఏపీ 'యోగాంధ్ర-2025' గురించి మాట్లాడిన ప్రధాని మోదీ
  • ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు
  • యోగాంధ్ర లక్ష్యసాధనకు ప్రజలంతా ఐక్యంగా ఉన్నారన్న ముఖ్యమంత్రి
  • జూన్ 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల యోగా కార్యక్రమాలు
  • అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ రావాలని మోదీకి ఆహ్వానం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఏపీకి చెందిన 'యోగాంధ్ర-2025' కార్యక్రమాన్ని ప్రస్తావించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 'యోగాంధ్ర-2025' లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఐక్యంగా కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

ఈ లక్ష్య సాధనలో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ యోగా శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. వంద పర్యాటక ప్రదేశాలతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. యోగాను ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవమైన జూన్ 21న విశాఖపట్నంలో జరగనున్న వేడుకలకు హాజరు కావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఓ పోస్టు చేశారు. యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, విశాఖలో ప్రధాని మోదీకి స్వాగతం పలకడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.
Chandrababu Naidu
Man Ki Baat
Yoga Andhra 2025
Narendra Modi
Andhra Pradesh
International Yoga Day
Visakhapatnam
Yoga Camps
AP Tourism

More Telugu News