Imran Khan: భారత్ మరో దాడి చేయొచ్చు జాగ్రత్త.. పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఇమ్రాన్ ఖాన్
- పాకిస్థాన్లో ఆటవిక రాజ్యం నడుస్తోందన్న ఇమ్రాన్
- పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు ఫీల్డ్ మార్షల్ హోదాపై ఇమ్రాన్ ఖాన్ సెటైర్లు
- తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, కనీస హక్కులు లేవని ఆరోపణ
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్కు ఫీల్డ్ మార్షల్ హోదా కల్పించడంపై ఆ దేశ మాజీ ప్రధాని, ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో ప్రస్తుతం ‘ఆటవిక చట్టం’ నడుస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో జనరల్ మునీర్కు ‘రాజు’ అనే బిరుదు ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు జైలు నుంచే 'ఎక్స్' వేదికగా ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.
భారత్తో ఇటీవల జరిగిన ఘర్షణలో కీలక పాత్ర పోషించినందుకు గాను జనరల్ అసిమ్ మునీర్కు మంగళవారం ఫీల్డ్ మార్షల్ హోదాను ప్రకటించారు. పాకిస్థాన్ చరిత్రలో ఈ గౌరవం పొందిన రెండో సైనికాధికారి జనరల్ మునీర్ కావడం గమనార్హం. ఈ పదోన్నతిపై ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ "మాషా అల్లా, జనరల్ అసిమ్ మునీర్ను ఫీల్డ్ మార్షల్ను చేశారు. నిజం చెప్పాలంటే, ఆయనకు 'రాజు' అనే బిరుదు ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో ఆటవిక చట్టం నడుస్తోంది. అడవిలో ఒక్కడే రాజు ఉంటాడు" అని సెటైర్ వేశారు.
సైన్యంతో ఎలాంటి ఒప్పందం లేదు.. చర్చలకు సిద్ధం
ఆగస్టు 2023 నుంచి పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్, సైన్యంతో తాను ఏదో ఒప్పందం కుదుర్చుకున్నానంటూ వస్తున్న వదంతులను ఖండించారు. "ఎలాంటి ఒప్పందం జరగలేదు, ప్రస్తుతం ఎటువంటి చర్చలూ కొనసాగడం లేదు. ఇవన్నీ నిరాధారమైన అబద్ధాలు" అని ఆయన స్పష్టం చేశారు. అయితే, పాకిస్థాన్ ప్రయోజనాలు, భవిష్యత్తు దృష్ట్యా దేశ ఐక్యత కోసం సైనిక నాయకత్వంతో చర్చలు జరపడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. "దేశం ప్రస్తుతం బాహ్య ముప్పులు, పెరుగుతున్న ఉగ్రవాదం, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మనమంతా ఏకం కావాలి. నా కోసం నేనెప్పుడూ ఏమీ అడగలేదు, ఇకముందు కూడా అడగను" అని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వానికి కీలక సూచన
షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఇమ్రాన్ ఖాన్ ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. భారత్ మరోసారి దాడికి పాల్పడే అవకాశం ఉందని, కాబట్టి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని అణచివేస్తున్నారని ఆయన ఆరోపించారు. "పెద్ద దొంగలకు పెద్ద పదవులు కట్టబెడుతున్నారనే సందేశం ఇస్తుంటే, న్యాయాన్ని పాతిపెట్టినట్లే. అధ్యక్షుడు ఆసిఫ్ జర్దారీ సోదరిపై ఉద్యోగుల పేర్లతో నమోదైన ఐదు అపార్ట్మెంట్లకు సంబంధించిన కేసు నాబ్ వద్ద ఇంకా పెండింగ్లోనే ఉంది. ఆమె విదేశాల్లో ఉన్నారు, ఆమెను ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. 22 బిలియన్ రూపాయల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న షెహబాజ్ షరీఫ్ను ప్రధానమంత్రిని చేశారు" అని ఇమ్రాన్ విమర్శించారు.
పాక్ నైతిక పతనం
గత మూడేళ్లలో పాకిస్థాన్ నైతిక, రాజ్యాంగ చట్రం పూర్తిగా నాశనమైందని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. "తోషాఖానా-II కేసులో తూతూమంత్రంగా విచారణను పునఃప్రారంభించారు. జైలులో మాదిరిగానే, కోర్టులో కూడా ఒక కల్నల్ ఇష్టానుసారమే నడుస్తోంది. నా సోదరీమణులను, న్యాయవాదులను కోర్టులోకి అనుమతించడం లేదు. నా సహచరులను నన్ను కలవనివ్వడం లేదు. నెలల తరబడి నా పిల్లలతో మాట్లాడే అవకాశం లేకుండా చేశారు. నా పుస్తకాలు కూడా నాకు చేరడం లేదు. నా వైద్యుడిని సంప్రదించేందుకు కూడా అనుమతించడం లేదు. ఇది కోర్టు ఆదేశాలు, చట్టాలను నిరంతరం ఉల్లంఘించడమే" అని ఇమ్రాన్ ఆవేదన వెలిబుచ్చారు.
భారత్తో ఇటీవల జరిగిన ఘర్షణలో కీలక పాత్ర పోషించినందుకు గాను జనరల్ అసిమ్ మునీర్కు మంగళవారం ఫీల్డ్ మార్షల్ హోదాను ప్రకటించారు. పాకిస్థాన్ చరిత్రలో ఈ గౌరవం పొందిన రెండో సైనికాధికారి జనరల్ మునీర్ కావడం గమనార్హం. ఈ పదోన్నతిపై ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ "మాషా అల్లా, జనరల్ అసిమ్ మునీర్ను ఫీల్డ్ మార్షల్ను చేశారు. నిజం చెప్పాలంటే, ఆయనకు 'రాజు' అనే బిరుదు ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో ఆటవిక చట్టం నడుస్తోంది. అడవిలో ఒక్కడే రాజు ఉంటాడు" అని సెటైర్ వేశారు.
సైన్యంతో ఎలాంటి ఒప్పందం లేదు.. చర్చలకు సిద్ధం
ఆగస్టు 2023 నుంచి పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్, సైన్యంతో తాను ఏదో ఒప్పందం కుదుర్చుకున్నానంటూ వస్తున్న వదంతులను ఖండించారు. "ఎలాంటి ఒప్పందం జరగలేదు, ప్రస్తుతం ఎటువంటి చర్చలూ కొనసాగడం లేదు. ఇవన్నీ నిరాధారమైన అబద్ధాలు" అని ఆయన స్పష్టం చేశారు. అయితే, పాకిస్థాన్ ప్రయోజనాలు, భవిష్యత్తు దృష్ట్యా దేశ ఐక్యత కోసం సైనిక నాయకత్వంతో చర్చలు జరపడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. "దేశం ప్రస్తుతం బాహ్య ముప్పులు, పెరుగుతున్న ఉగ్రవాదం, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మనమంతా ఏకం కావాలి. నా కోసం నేనెప్పుడూ ఏమీ అడగలేదు, ఇకముందు కూడా అడగను" అని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వానికి కీలక సూచన
షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఇమ్రాన్ ఖాన్ ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. భారత్ మరోసారి దాడికి పాల్పడే అవకాశం ఉందని, కాబట్టి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని అణచివేస్తున్నారని ఆయన ఆరోపించారు. "పెద్ద దొంగలకు పెద్ద పదవులు కట్టబెడుతున్నారనే సందేశం ఇస్తుంటే, న్యాయాన్ని పాతిపెట్టినట్లే. అధ్యక్షుడు ఆసిఫ్ జర్దారీ సోదరిపై ఉద్యోగుల పేర్లతో నమోదైన ఐదు అపార్ట్మెంట్లకు సంబంధించిన కేసు నాబ్ వద్ద ఇంకా పెండింగ్లోనే ఉంది. ఆమె విదేశాల్లో ఉన్నారు, ఆమెను ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. 22 బిలియన్ రూపాయల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న షెహబాజ్ షరీఫ్ను ప్రధానమంత్రిని చేశారు" అని ఇమ్రాన్ విమర్శించారు.
పాక్ నైతిక పతనం
గత మూడేళ్లలో పాకిస్థాన్ నైతిక, రాజ్యాంగ చట్రం పూర్తిగా నాశనమైందని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. "తోషాఖానా-II కేసులో తూతూమంత్రంగా విచారణను పునఃప్రారంభించారు. జైలులో మాదిరిగానే, కోర్టులో కూడా ఒక కల్నల్ ఇష్టానుసారమే నడుస్తోంది. నా సోదరీమణులను, న్యాయవాదులను కోర్టులోకి అనుమతించడం లేదు. నా సహచరులను నన్ను కలవనివ్వడం లేదు. నెలల తరబడి నా పిల్లలతో మాట్లాడే అవకాశం లేకుండా చేశారు. నా పుస్తకాలు కూడా నాకు చేరడం లేదు. నా వైద్యుడిని సంప్రదించేందుకు కూడా అనుమతించడం లేదు. ఇది కోర్టు ఆదేశాలు, చట్టాలను నిరంతరం ఉల్లంఘించడమే" అని ఇమ్రాన్ ఆవేదన వెలిబుచ్చారు.