మార్గమధ్యలో చిక్కుకుపోయిన కైలస మానస సరోవర్ యాత్రికులు
- ఉత్తరాఖండ్ లో విరిగిపడ్డ కొండచరియలు
- సహాయక చర్యలు చేపట్టిన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్
- ఐదేళ్ల తర్వాత ఇటీవల మొదలైన యాత్ర
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోరాగఢ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2020లో కరోనా మహమ్మారి కారణంగా కైలాస మానస సరోవర్ యాత్రను అధికారులు నిలిపివేశారు. కరోనా తగ్గినప్పటికీ గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల కారణంగా భారత్, చైనా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ఈ యాత్రను పునరుద్ధరించలేదు. ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల ఫలితంగా మానస సరోవర్ యాత్రను ఐదేళ్ల తర్వాత ఈ ఏడాదే తిరిగి ప్రారంభించారు.