Vikram Misri: సొంత నేరంపై దర్యాప్తు చేయాలని దొంగను అడుగుతామా? పాక్ కూడా అంతే: మిస్రీ
- భారత్ 'ఆపరేషన్ సిందూర్ అవుట్రీచ్
- పాక్ ఉగ్రసంబంధాలపై ప్రపంచానికి వివరించేందుకు ప్రత్యేక బృందాలు
- పహల్గామ్ దాడిపై పాకిస్థాన్ సంయుక్త దర్యాప్తు ప్రతిపాదనను ఖండించిన భారత్
'ఆపరేషన్ సిందూర్' విజయవంతమైన నేపథ్యంలో, ఉగ్రవాదంతో పాకిస్థాన్కు ఉన్న ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలను ప్రపంచ దేశాల ముందుంచేందుకు "ఆపరేషన్ సిందూర్ అవుట్రీచ్" పేరుతో భారత్ ఒక సాహసోపేతమైన దౌత్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ భారీ ప్రచారంలో భాగంగా, మాజీ మంత్రులు, అనుభవజ్ఞులైన దౌత్యవేత్తలు, సీనియర్ రాజకీయ నాయకులతో కూడిన 59 మంది పార్లమెంటు సభ్యుల ఏడు ఉన్నతస్థాయి బృందాలు మే 21 నుంచి జూన్ 5 మధ్య 33 దేశాల్లో పర్యటించనున్నాయి.
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పర్యటనకు వెళ్లనున్న బృందాలకు వివరాలు అందిస్తూ మీడియాతో మాట్లాడారు."భారత్ నాలుగు దశాబ్దాలకు పైగా సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. ఇటువంటి కార్యకలాపాలను ఎదుర్కోవడంలో మేము ఒక కొత్త, దృఢమైన విధానాన్ని అవలంబించాం," అని స్పష్టం చేశారు. పహల్గామ్ దాడిపై పాకిస్థాన్ సంయుక్త దర్యాప్తు ప్రతిపాదనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. "భారత భూభాగంపై జరిగిన ఉగ్రదాడులపై దర్యాప్తులో పాకిస్థాన్ను భాగస్వామిని చేయడం అంటే, దొంగ చేతికే తాళాలు అప్పగించినట్లు అవుతుంది. సొంత నేరంపై దర్యాప్తు చేయాలని దొంగను అడుగుతామా? పాక్ తో సంయుక్త దర్యాప్తు కూడా అంతే" అని వ్యాఖ్యానించారు.
ప్రతి బృందం కూడా పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఐ ఉగ్రవాదాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నాయో తెలిపే రహస్య దస్త్రాలు, నిఘా సమాచారంతో పాటు, నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై ఇటీవల జరిపిన 'ఆపరేషన్ సిందూర్' నుంచి లభించిన ప్రత్యక్ష ఆధారాలను కూడా తీసుకెళ్లనుంది. టోక్యో నుంచి వాషింగ్టన్ వరకు, బ్రస్సెల్స్ నుంచి జకార్తా వరకు వ్యూహాత్మక రాజధానుల్లో ఈ ప్రచారం సాగనుంది. ఎంపీలు విదేశీ ప్రభుత్వాలు, పార్లమెంటేరియన్లు, మీడియా, పౌర సమాజం, ప్రవాస భారతీయులు, అంతర్జాతీయ సంస్థలతో సమావేశమై పాక్ ఉగ్ర కార్యకలాపాలపై సాక్ష్యాలు సమర్పిస్తారు.
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పర్యటనకు వెళ్లనున్న బృందాలకు వివరాలు అందిస్తూ మీడియాతో మాట్లాడారు."భారత్ నాలుగు దశాబ్దాలకు పైగా సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. ఇటువంటి కార్యకలాపాలను ఎదుర్కోవడంలో మేము ఒక కొత్త, దృఢమైన విధానాన్ని అవలంబించాం," అని స్పష్టం చేశారు. పహల్గామ్ దాడిపై పాకిస్థాన్ సంయుక్త దర్యాప్తు ప్రతిపాదనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. "భారత భూభాగంపై జరిగిన ఉగ్రదాడులపై దర్యాప్తులో పాకిస్థాన్ను భాగస్వామిని చేయడం అంటే, దొంగ చేతికే తాళాలు అప్పగించినట్లు అవుతుంది. సొంత నేరంపై దర్యాప్తు చేయాలని దొంగను అడుగుతామా? పాక్ తో సంయుక్త దర్యాప్తు కూడా అంతే" అని వ్యాఖ్యానించారు.
ప్రతి బృందం కూడా పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఐ ఉగ్రవాదాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నాయో తెలిపే రహస్య దస్త్రాలు, నిఘా సమాచారంతో పాటు, నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద శిబిరాలపై ఇటీవల జరిపిన 'ఆపరేషన్ సిందూర్' నుంచి లభించిన ప్రత్యక్ష ఆధారాలను కూడా తీసుకెళ్లనుంది. టోక్యో నుంచి వాషింగ్టన్ వరకు, బ్రస్సెల్స్ నుంచి జకార్తా వరకు వ్యూహాత్మక రాజధానుల్లో ఈ ప్రచారం సాగనుంది. ఎంపీలు విదేశీ ప్రభుత్వాలు, పార్లమెంటేరియన్లు, మీడియా, పౌర సమాజం, ప్రవాస భారతీయులు, అంతర్జాతీయ సంస్థలతో సమావేశమై పాక్ ఉగ్ర కార్యకలాపాలపై సాక్ష్యాలు సమర్పిస్తారు.