Telangana Government: తెలంగాణలో మందుబాబులకు షాక్... పెరిగిన మద్యం ధరలు
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే బీర్ల రేట్లను భారీగా పెంచిన ప్రభుత్వం... ఇప్పుడు మద్యం ధరలను పెంచింది. క్వార్టర్ కు రూ. 10, హాఫ్ కు రూ. 20, ఫుల్ బాటిల్ కు రూ. 40 పెంచేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం ధరలను పెంచడం వల్ల రాష్ట్ర ఖజానాకు ప్రతి నెల అదనంగా రూ. 160 కోట్ల మేర ఆదాయం సమకూరనుంది. అయితే, చీప్ లిక్కర్ ధరను మాత్రం ప్రభుత్వం పెంచకపోవడం గమనార్హం.