మీరేం చేస్తే మేమూ అదే చేస్తామంటున్న పాక్.. విదేశాలకు ప్రతినిధి బృందాలు
- విదేశాలకు శాంతి రాయబారుల బృందాన్ని పంపుతున్న పాక్ ప్రధాని
- ప్రతిపక్ష నేత బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలో బృందం ఏర్పాటు
- మోదీ ఎయిర్ ఫోర్స్ బేస్ ను సందర్శిస్తే సైనిక శిబిరాన్ని విజిట్ చేసిన షరీఫ్
ప్రతిపక్ష నేత బిలావల్ భుట్టో జర్దారీ ఈ బృందానికి నాయకత్వం వహిస్తారని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. దీనిపై బిలావల్ భుట్టో ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ గొంతుక వినిపించే అవకాశం ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనకు అప్పగించారని చెప్పారు. ఈ విషయంపై ప్రధాని తనతో సంప్రదింపులు జరిపారని వివరించారు. ఈ బాధ్యతను స్వీకరించడం తనకు గర్వకారణమని అన్నారు. దేశసేవ కోసం తాను ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించగా.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సియాల్కోట్లోని తమ సైనిక స్థావరాన్ని సందర్శించిన విషయం తెలిసిందే.