Hyderabad Metro Rail: ఎల్లుండి నుంచి పెరగనున్న హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

Hyderabad Metro Rail Fare Hike Prices to Increase from November 17th
  • హైదరాబాద్ మెట్రో రైలులో ఛార్జీల పెంపు
  • ఈ నెల 17వ తేదీ నుంచి కొత్త ధరలు అమలు
  • కనీస టికెట్ ధర రూ.10 నుంచి రూ.12కి పెంపు
  • గరిష్ఠ టికెట్ ధర రూ.60 నుంచి రూ.75కి పెంపు
  • వివిధ దూరాలకు అనుగుణంగా ఛార్జీల సవరణ
హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్. నగరంలో ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ ఛార్జీలు త్వరలో పెరగనున్నాయి. ఛార్జీలను పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. సవరించిన నూతన ఛార్జీలు ఈ నెల 17వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ స్పష్టం చేసింది.

ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10 ఉండగా, దానిని రూ.12కి పెంచారు. అదేవిధంగా, గరిష్ఠ ప్రయాణ ఛార్జీ రూ.60 నుంచి రూ.75కి పెరగనుంది. ప్రయాణించే స్టేషన్ల సంఖ్య ఆధారంగా ఛార్జీల శ్లాబులను సవరించారు. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, పెరిగిన ఛార్జీలు ఈ విధంగా ఉన్నాయి:

- రెండు స్టేషన్ల వరకు ప్రయాణానికి కనీస ఛార్జీ రూ.12.
- 2 నుంచి 4 స్టేషన్ల మధ్య ప్రయాణిస్తే రూ.18.
- 4 నుంచి 6 స్టేషన్ల వరకు రూ.30.
- 6 నుంచి 9 స్టేషన్ల వరకు ప్రయాణానికి రూ.40.
- 9 నుంచి 12 స్టేషన్ల వరకు రూ.50.
- 12 నుంచి 15 స్టేషన్ల వరకు రూ.55.
- 15 నుంచి 18 స్టేషన్ల వరకు ప్రయాణిస్తే రూ.60.
- 18 నుంచి 21 స్టేషన్ల వరకు రూ.66.
- 21 నుంచి 24 స్టేషన్ల వరకు రూ.70.
- 24 స్టేషన్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించినట్లయితే రూ.75 చెల్లించాల్సి ఉంటుంది.
Hyderabad Metro Rail
Metro Fare Hike
Hyderabad Metro Charges
Increased Metro Prices
Hyderabad Local Transport

More Telugu News