నూతన సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్... శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్
- రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారోత్సవం
- హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ
నిబంధనల ప్రకారం, రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో రాష్ట్రపతి, జస్టిస్ గవాయ్తో భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఇతర న్యాయ ప్రముఖులు, ఉన్నతాధికారులు మరియు జస్టిస్ గవాయ్ కుటుంబ సభ్యులు హాజరైనట్లు సమాచారం.
ఈ సందర్భంగా నూతన సీజేఐ బీఆర్ గవాయ్ కి ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. "భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యాను. ఆయన పదవీకాలం అత్యంత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను" అని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
