India: పాకిస్థాన్ కు చైనా ఇచ్చిన రెండు JF17 విమానాలను కూల్చివేసిన భారత్!

Two Pakistani JF17 Fighter Jets Destroyed by India
  • సరిహద్దులో అత్యంత ఉద్రిక్తంగా పరిస్థితి
  • భారీగా నష్టపోతున్న పాకిస్థాన్
  • భారత్ వైపు వచ్చిన రెండు పాక్ ఫైటర్ జెట్ల కూల్చివేత
భారత్-పాక్ సరిహద్దుల్లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. భారత్ పై పాక్ మిస్సైల్స్ లో దాడి చేస్తోంది. వాటిని భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. సరిహద్దు దాటే క్షిపణులను అడ్డుకుంటోంది. 

భారత్ ప్రతి దాడుల్లో పాక్ భారీగా నష్టపోతోంది. ముఖ్యంగా భారత్ వైపు చొచ్చుకువచ్చిన రెండు జేఎఫ్17 రెండు యుద్ధ విమానాలను భారత బలగాలు కూల్చివేశాయి. ఈ విమానాలను పాకిస్థాన్ కు చైనా సమకూర్చింది. అయితే, ఈ దాడుల్లో పాక్ పైలట్లు చనిపోయారా? లేదా జెట్ నుంచి ఎజెక్ట్ కావడం ద్వారా ప్రాణాలు కాపాడుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఈ నష్టాన్ని ధృవీకరించారు. "విధి నిర్వహణలో ఉండగా రెండు జెఎఫ్-17 విమానాలను కోల్పోయామని చెప్పడానికి చింతిస్తున్నాం" అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

India
Pakistan
JF-17 Thunder
China
Air Defense System
Indo-Pak Conflict
Missile Attacks
Military Aircraft
Jet Fighters

More Telugu News