భారత్ వెనక్కి తగ్గితేనే ఉద్రిక్తతలు చల్లారతాయి: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్
- భారత్ దూకుడు తగ్గించుకుంటేనే ఉద్రిక్తతలు తగ్గుతాయన్న పాక్ రక్షణ మంత్రి
- 'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత్ దాడులు చేసిందని పాక్ ఆరోపణ
- భారత వైమానిక దాడుల్లో 26 మంది మృతి, 46 మందికి గాయాలని పాక్ వెల్లడి
బ్లూమ్బెర్గ్ వార్తా సంస్థతో మాట్లాడుతూ, భారత్ నుంచి ఎలాంటి దురాక్రమణ ఎదురైనా దానికి ప్రతిస్పందించే హక్కు పాకిస్థాన్కు ఉందని ఖవాజా ఆసిఫ్ అన్నారు. ప్రస్తుత ఘర్షణలో ఇస్లామాబాద్ కేవలం భారత దాడులకు ప్రతిస్పందిస్తోందని, తమను దురాక్రమణదారులుగా చూడరాదని ఆయన నొక్కి చెప్పారు. "ఈ ఉద్రిక్తతలను ప్రారంభించింది భారత్. ఒకవేళ భారత్ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉంటే, మేం కచ్చితంగా ఈ ఉద్రిక్తతలను చల్లార్చుతాం" అని ఆయన తెలిపారు. "మేం దాడికి గురైనంత కాలం, కాల్పులు జరుగుతున్నంత కాలం, మేం స్పందించాల్సి ఉంటుంది. మమ్మల్ని మేం రక్షించుకోవాలి. కానీ భారత్ వెనక్కి తగ్గితే, మేం ఈ ఉద్రిక్తతలను ముగిస్తాం" అని పాక్ రక్షణ మంత్రి పునరుద్ఘాటించారు.