వేసవి సెలవుల సందర్బంగా భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ
- సులభతరంగా శ్రీవారి సర్వదర్శనం
- వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నిరీక్షణకు తెర
- రేపటి నుంచి పద్మావతి పరిణయోత్సవాలు
నిన్న ఒక్కరోజే 83,380 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 27,936 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.35 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ వెల్లడించింది.
ఇదిలా ఉండగా, రేపటి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఉత్సవాల నేపథ్యంలో మూడు రోజుల పాటు ఆలయంలో నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.