ఆ సమయంలో టీ20లకు రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించానో వెల్లడించిన విరాట్ కోహ్లీ
- 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ టీ20ల నుంచి వైదొలగిన కోహ్లీ
- కొత్త ఆటగాళ్లు సిద్ధమవ్వడానికి సమయం ఇవ్వాలనేదే తన నిర్ణయానికి కారణమని వెల్లడి
- యువ ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించి, వివిధ పరిస్థితుల్లో అనుభవం పొందాలని ఆకాంక్ష
"కొత్త ఆటగాళ్లు జట్టులోకి వచ్చి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఆడి, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవాలి. ప్రపంచ కప్ నాటికి వారు పూర్తిగా సిద్ధంగా ఉన్నామనే భావన కలగాలంటే, వారికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. అందుకే టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ముగిసిన వెంటనే వీడ్కోలు నిర్ణయం తీసుకున్నాను" అని వివరించాడు. ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ, తన టీ20 కెరీర్లో 125 మ్యాచ్ల్లో 4,188 పరుగులు సాధించాడు.