మరో 36 గంటల్లో పాకిస్థాన్పై భారత్ సైనిక చర్య.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు
- కీలక వ్యాఖ్యలు చేసిన పాక్ మంత్రి అతవుల్లా తరార్
- నిఘా వర్గాల నుంచి తమకు పక్కా సమాచారం ఉందన్న మంత్రి
- ప్రతి చర్య తీవ్రంగా ఉంటుందని భారత్కు హెచ్చరిక
పహల్గామ్ ఉగ్రదాడిపై ఇటీవల అక్కసు వెళ్లగక్కిన అతవుల్లా తరార్.. తాము కూడా ఉగ్రవాద బాధితులమేనని మొసలి కన్నీరు కార్చారు. పహల్గామ్ దాడిపై తటస్థ, పారదర్శక, స్వతంత్ర దర్యాప్తునకు సహకరిస్తామని ప్రకటించారు. అయినప్పటికీ భారత్ సైనిక చర్యకు సిద్ధమవుతోందని ఆరోపించారు. అయితే, భారత్ చర్యకు ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.