కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన ఏపీ ప్రభుత్వం

AP Government Extends Contract Employees Service
  • ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ ఏడాది పొడిగింపు
  • 2026 మార్చి 30 వరకు కొనసాగింపునకు ప్రభుత్వం నిర్ణయం
  • ఆర్థిక శాఖ అనుమతితో నియామకం అయిన వారికే వర్తింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవా కాలాన్ని మరో సంవత్సరం పాటు పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, జిల్లా కార్యాలయాల్లో పనిచేస్తున్న అనేక మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీకాలం ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో, వారి సర్వీసులను 2026 మార్చి 30వ తేదీ వరకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేశారు.

అయితే, ఈ సేవల పొడిగింపునకు ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిబంధనను చేర్చింది. గతంలో ఆర్థిక శాఖ ముందస్తు అనుమతితో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే ఈ పొడిగింపు ప్రయోజనం వర్తిస్తుందని ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిబంధన పరిధిలోకి రాని వారికి ఈ పొడిగింపు వర్తించదు.

అంతేకాకుండా, భవిష్యత్తులో కొత్తగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులను నియమించుకోవాలంటే, తప్పనిసరిగా ముందుగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా కొత్త కాంట్రాక్ట్ నియామకాలు చేపట్టరాదని తెలిపింది.
Go Back to Shorts
Andhra Pradesh Government
Contract Employees
AP Government
Contractual Jobs
Job Extension
Piyush Kumar
Government Jobs Andhra Pradesh
Employment News Andhra Pradesh
Contractual Workers
AP Finance Department

More Telugu News