Sanjana Ganesan: కుమారుడ్ని ట్రోల్ చేయడం పట్ల బుమ్రా భార్య ఆవేదన
- కుమారుడు అంగద్పై సోషల్ మీడియా ట్రోల్స్పై బుమ్రా భార్య సంజ*న ఆవేదన
- ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా అంగద్ 3 సెకన్ల పాటు కెమెరాలో కనిపించడంతో చర్చ
- నా కొడుకు మీ వినోదం కోసం కాదు అంటూ ఇన్స్టాలో సంజన ఘాటు పోస్ట్
టీమిండియా స్టార్ పేసర్, ముంబయి ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భార్య, ప్రముఖ స్పోర్ట్స్ ప్రెజెంటర్ సంజనా గణేశన్ సోషల్ మీడియాలో నెటిజన్లపై, ట్రోలర్స్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడు అంగద్ను ఉద్దేశించి వస్తున్న అనవసర కామెంట్లు, ట్రోల్స్పై ఆమె ఘాటుగా స్పందించారు. చిన్నారిని వినోద వస్తువుగా చూడటంపై మండిపడ్డారు.
అసలేం జరిగిందంటే..?
ఆదివారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు బుమ్రాకు మద్దతుగా సంజనా గణేశన్, వారి కుమారుడు అంగద్ హాజరయ్యారు. ఈ మ్యాచ్లో బుమ్రా అద్భుతంగా రాణించి 4 వికెట్లు పడగొట్టడంతో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. బుమ్రా వికెట్లు తీస్తున్న సమయంలో స్టాండ్స్లో ఉన్న అంగద్పై కెమెరామెన్ దృష్టి సారించారు. దాదాపు మూడు సెకన్ల పాటు అంగద్ తెరపై కనిపించాడు.
సోషల్ మీడియాలో వైరల్.. సంజన ఆగ్రహం
మ్యాచ్ ముగిసిన తర్వాత, అంగద్కు సంబంధించిన ఆ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పలువురు నెటిజన్లు ఆ చిన్నారి హావభావాలపై రకరకాల కామెంట్లు చేయడం, మీమ్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. ఇది సంజనా గణేశన్ దృష్టికి వెళ్లడంతో ఆమె తీవ్రంగా కలత చెందారు. తన కుమారుడిని ఇలా సోషల్ మీడియాలో వినోద వస్తువుగా మార్చడంపై మండిపడుతూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
"మా అబ్బాయి మీ వినోదం కోసం ఒక టాపిక్ కాదు" అని సంజన తన పోస్ట్లో ఘాటుగా పేర్కొన్నారు. "జస్ప్రీత్, నేను మా అంగద్ను సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఇంటర్నెట్ అనేది చాలా నీచమైన, దారుణమైన ప్రదేశం. కెమెరాలు నిండిన క్రికెట్ స్టేడియానికి ఒక చిన్నారిని తీసుకురావడం వల్ల కలిగే పరిణామాలను నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. కానీ దయచేసి అర్థం చేసుకోండి, నేను, అంగద్ కేవలం జస్ప్రీత్కు మద్దతు ఇవ్వడానికి మాత్రమే అక్కడికి వెళ్ళాం" అని ఆమె వివరించారు.
"మా అబ్బాయి ఇంటర్నెట్లో వైరల్ కంటెంట్గా మారాలని గానీ, జాతీయ వార్తల్లో నిలవాలని గానీ మాకు ఎలాంటి ఆసక్తి లేదు. కేవలం 3 సెకన్ల ఫుటేజ్ను చూసి, అనవసరంగా అభిప్రాయాలు చెప్పే కీబోర్డ్ వారియర్స్ అంగద్ ఎవరో, అతని సమస్య ఏంటో, అతని వ్యక్తిత్వం ఎలాంటిదో నిర్ణయించడం మాకు ఇష్టం లేదు" అని సంజన స్పష్టం చేశారు.
"వాడి వయసు కేవలం ఏడాదిన్నర మాత్రమే. ఒక చిన్న పిల్లాడి గురించి 'ట్రామా', 'డిప్రెషన్' వంటి పదాలు వాడటం మనం ఒక సమాజంగా ఎటువైపు వెళుతున్నామో చెబుతోంది. ఇది నిజంగా విచారకరం. మా అబ్బాయి గురించి, మా జీవితాల గురించి మీకు ఏమీ తెలియదు. దయచేసి మీ ఆన్లైన్ అభిప్రాయాలను దానికి అనుగుణంగానే ఉంచుకోవాలని అభ్యర్థిస్తున్నాను" అని ఆవేదన వ్యక్తం చేశారు.
"నేటి ప్రపంచంలో కొంచెం నిజాయతీ, కొంచెం దయ చాలా దూరం తీసుకువెళతాయి" అని ఆమె తన పోస్ట్ను ముగించారు. సంజన పోస్ట్తో పలువురు ఏకీభవిస్తూ, చిన్న పిల్లలను అనవసరంగా సోషల్ మీడియా చర్చల్లోకి లాగడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
అసలేం జరిగిందంటే..?
ఆదివారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు బుమ్రాకు మద్దతుగా సంజనా గణేశన్, వారి కుమారుడు అంగద్ హాజరయ్యారు. ఈ మ్యాచ్లో బుమ్రా అద్భుతంగా రాణించి 4 వికెట్లు పడగొట్టడంతో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. బుమ్రా వికెట్లు తీస్తున్న సమయంలో స్టాండ్స్లో ఉన్న అంగద్పై కెమెరామెన్ దృష్టి సారించారు. దాదాపు మూడు సెకన్ల పాటు అంగద్ తెరపై కనిపించాడు.
సోషల్ మీడియాలో వైరల్.. సంజన ఆగ్రహం
మ్యాచ్ ముగిసిన తర్వాత, అంగద్కు సంబంధించిన ఆ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పలువురు నెటిజన్లు ఆ చిన్నారి హావభావాలపై రకరకాల కామెంట్లు చేయడం, మీమ్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. ఇది సంజనా గణేశన్ దృష్టికి వెళ్లడంతో ఆమె తీవ్రంగా కలత చెందారు. తన కుమారుడిని ఇలా సోషల్ మీడియాలో వినోద వస్తువుగా మార్చడంపై మండిపడుతూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
"మా అబ్బాయి మీ వినోదం కోసం ఒక టాపిక్ కాదు" అని సంజన తన పోస్ట్లో ఘాటుగా పేర్కొన్నారు. "జస్ప్రీత్, నేను మా అంగద్ను సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఇంటర్నెట్ అనేది చాలా నీచమైన, దారుణమైన ప్రదేశం. కెమెరాలు నిండిన క్రికెట్ స్టేడియానికి ఒక చిన్నారిని తీసుకురావడం వల్ల కలిగే పరిణామాలను నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. కానీ దయచేసి అర్థం చేసుకోండి, నేను, అంగద్ కేవలం జస్ప్రీత్కు మద్దతు ఇవ్వడానికి మాత్రమే అక్కడికి వెళ్ళాం" అని ఆమె వివరించారు.
"మా అబ్బాయి ఇంటర్నెట్లో వైరల్ కంటెంట్గా మారాలని గానీ, జాతీయ వార్తల్లో నిలవాలని గానీ మాకు ఎలాంటి ఆసక్తి లేదు. కేవలం 3 సెకన్ల ఫుటేజ్ను చూసి, అనవసరంగా అభిప్రాయాలు చెప్పే కీబోర్డ్ వారియర్స్ అంగద్ ఎవరో, అతని సమస్య ఏంటో, అతని వ్యక్తిత్వం ఎలాంటిదో నిర్ణయించడం మాకు ఇష్టం లేదు" అని సంజన స్పష్టం చేశారు.
"వాడి వయసు కేవలం ఏడాదిన్నర మాత్రమే. ఒక చిన్న పిల్లాడి గురించి 'ట్రామా', 'డిప్రెషన్' వంటి పదాలు వాడటం మనం ఒక సమాజంగా ఎటువైపు వెళుతున్నామో చెబుతోంది. ఇది నిజంగా విచారకరం. మా అబ్బాయి గురించి, మా జీవితాల గురించి మీకు ఏమీ తెలియదు. దయచేసి మీ ఆన్లైన్ అభిప్రాయాలను దానికి అనుగుణంగానే ఉంచుకోవాలని అభ్యర్థిస్తున్నాను" అని ఆవేదన వ్యక్తం చేశారు.
"నేటి ప్రపంచంలో కొంచెం నిజాయతీ, కొంచెం దయ చాలా దూరం తీసుకువెళతాయి" అని ఆమె తన పోస్ట్ను ముగించారు. సంజన పోస్ట్తో పలువురు ఏకీభవిస్తూ, చిన్న పిల్లలను అనవసరంగా సోషల్ మీడియా చర్చల్లోకి లాగడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.