Indian Intelligence Agencies: తీర ప్రాంతాల్లో ఉగ్ర దాడులు జరగొచ్చు.. నిఘా సంస్థల హెచ్చరిక

India Coastal Areas Under Terrorist Threat Intelligence Agencies Issue Warning
--
దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థలు శనివారం హెచ్చరించాయి. డ్రోన్లు, ఐఈడీలతో దాడులు చేసే అవకాశం ఉందని తెలిపాయి. సముద్ర తీర ప్రాంతాల్లో భద్రత పెంచాలని సూచించాయి. ఈ మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. 

సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే ప్రమాదం ఉందని, తీర ప్రాంతాల్లో బందోబస్తు పెంచాలని సూచించింది. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేయొచ్చని రైల్వే శాఖను అప్రమత్తం చేసింది. ముంబయి ఉగ్రదాడి కీలక కుట్రదారు తహవ్వుర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకువచ్చి విచారిస్తోన్న సమయంలో ఈ అలర్ట్ రావడం గమనార్హం.
Indian Intelligence Agencies
Terrorist Attacks
Coastal Security
Drone Attacks
IED Attacks
Pakistan-sponsored Terrorism
India Security Alert
National Security Threat
Maritime Security

More Telugu News