Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్... అర్ధరాత్రి వరకు సేవలు

Good News for Hyderabad Commuters Metro Runs Till Midnight
  • నిన్నటి నుంచే అందుబాటులోకి సేవలు
  • ఇక నుంచి అర్ధరాత్రి 12 గంటలకు కూడా ప్రయాణించే అవకాశం
  • అర్ధరాత్రి విధులు ముగిసే వారికి, ఆ సమయంలో నగరానికి చేరుకునే దూర ప్రయాణికులకు ప్రయోజనకరం
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే. ప్రయాణికుల సౌకర్యార్థం అర్ధరాత్రి 12 గంటల వరకు సేవలు అందించాలని మెట్రో నిర్ణయించింది. నిన్నటి నుంచి కొత్త వేళలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం నష్టాల్లో నడుస్తున్న మెట్రో దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం ప్రతి రోజు సగటున 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఈ సంఖ్యను 7 లక్షలకు చేర్చాలనేది మెట్రో లక్ష్యం. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ప్రయాణికులు కూడా మెట్రో సేవలను పొడిగించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. వారి డిమాండ్ ఇన్నాళ్లకు నెరవేరింది.

రైళ్ల రాకపోకలకు, ట్రాక్ నిర్వహణకు సమయం చాలదన్న ఉద్దేశంతో ఇన్నాళ్లు రైళ్ల వేళల పెంపు విషయంలో మెట్రో తాత్సారం చేసింది. తాజాగా నిన్నటి నుంచి వేళలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అర్ధరాత్రి విధులు ముగించుకునే ఉద్యోగులకు, దూరప్రయాణాలు చేసి రాత్రివేళ నగరానికి చేరుకునే వారికి మెట్రో నిర్ణయం ఉపయోగకరంగా మారనుంది. మరోవైపు, నష్టాల ఊబి నుంచి బయటపడేందుకు ఛార్జీలను పెంచాలని మెట్రో ప్రతిపాదించింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Hyderabad Metro
Midnight Metro Services
Hyderabad Metro Rail
Extended Metro Hours
Metro Fare Hike Proposal
Public Transportation Hyderabad
Commuters Hyderabad
Hyderabad Metro Expansion

More Telugu News