AP Budget: నేడు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న ఏపీ ప్ర‌భుత్వం

Today Introduce The Annual Budget in The AP Assembly
షార్ట్స్‌లో చూడండి
ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఉద‌యం 10 గంట‌ల‌కు అసెంబ్లీలో మంత్రి ప‌య్యావుల కేశ‌వ్‌, మండ‌లిలో మంత్రి కొల్లు ర‌వీంద్ర బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడ‌తారు. సూప‌ర్ 6 ప‌థ‌కాలు, రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి బ‌డ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 

2025-26కు సంబంధించి సుమారు రూ. 3.20 ల‌క్ష‌ల కోట్ల అంచ‌నాల‌తో ఈ బ‌డ్జెట్ ఉంటుందని స‌మాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుప‌ర‌చ‌డమే ల‌క్ష్యంగా బ‌డ్జెట్‌ను రూపొందించిన‌ట్లు తెలుస్తోంది. ఈరోజు ఉద‌యం 9 గంట‌ల‌కు సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర మంత్రిమండ‌లి భేటీ కానుంది. ఈ స‌మావేశంలో బ‌డ్జెట్‌ను ఆమోదించ‌నున్నారు. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు అసెంబ్లీలో మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.  
Go Back to Shorts
AP Budget
Chandrababu
Andhra Pradesh

More Telugu News