కుంభమేళాలో స్మార్ట్ ఫోన్ను గంగలో ముంచిన మహిళ... ఎందుకంటే?
- భర్తకు వీడియో కాల్ చేసి ఫోన్ను పలుమార్లు గంగలో ముంచిన మహిళ
- సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతున్న వీడియో
- రేపటితో ముగియనున్న మహా కుంభమేళా
అయితే, కుంభమేళాలో ఒక మహిళ తన భర్త కోసం చేసిన పని అందరినీ విస్మయానికి గురి చేసింది. కుంభమేళాకు వెళ్లిన మహిళ తాను పుణ్యస్నానమాచరించిన అనంతరం, తన భర్తకు ఫోన్ చేసి, ఆ ఫోన్ను మూడుసార్లు నీట ముంచింది. తద్వారా తన భర్తకు పుణ్యస్నానమాచరించిన అనుభూతిని మిగిల్చే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది. భర్తకు వీడియో కాల్ చేసి ఫోన్ను పలుమార్లు గంగలో ముంచిన ఈ వీడియోపై నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.