ప్రియురాలితో జీహెచ్ఎంసీ జేసీ సహజీవనం... పట్టుకుని చితక్కొట్టిన భార్య
--
ఆపై కోపం పట్టలేక భర్తను, ఆయన ప్రియురాలిని ఎడాపెడా వాయించింది. వెంట వెళ్లిన బంధువులు కూడా తలో చెయ్యి వేయడంతో సదరు భర్త పరిస్థితి దారుణంగా మారింది.
హైదరాబాద్ లోని వారాసిగూడలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళితే... జీహెచ్ఎంసీలో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న జానకిరామ్ ఇటీవల ఇంటికి వెళ్లడం తగ్గించాడు.
క్యాంపులు, ఉద్యోగ బాధ్యతలని చెబుతూ ఎక్కువకాలం ఇంటికి దూరంగా ఉంటున్నాడు. దీంతో జానకిరామ్ పై ఆయన భార్య కల్యాణి నిఘా పెట్టింది. దీంతో జానకిరామ్ బండారం బయటపడింది. తనకన్నా ఇరవై ఏళ్లు చిన్నదైన యువతితో జానకిరామ్ వారాసిగూడలో ఏకంగా కాపురమే పెట్టినట్లు తేలింది. దీంతో బంధువులతో కలిసి భార్య కల్యాణి వారాసిగూడలోని జానకిరామ్ ఫ్లాట్ కు వెళ్లింది. ఆ సమయంలో మరో యువతితో రాసలీలల్లో మునిగిన భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదింది. ఆపై జానకిరామ్ తో పాటు ఆ యువతిని పోలీసులకు అప్పగించింది.