Telangana: హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి టీజీఎస్ఆర్టీసీ అదిరిపోయే రాయితీ

Special discount for Hyderabad Vijayawada route passengers
  • 8 శాతం నుండి 10 శాతం వరకు ప్రత్యేక రాయితీ ప్రకటన
  • లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం రాయితీ
  • రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం రాయితీ
హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ మార్గంలో ప్రయాణించే వారికి రాయితీలను ప్రకటించింది. ఆయా బస్సుల్లో 8 శాతం నుండి 10 శాతం వరకు ప్రత్యేక రాయితీ ఇస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది.

లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసులలో 10 శాతం రాయితీని ప్రకటించింది. రాజధాని ఏసీ సర్వీసుల్లో 8 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించేవారు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ యాజమాన్యం కోరింది. టీజీఎస్ఆర్టీసీ వెబ్ సైట్ ద్వారా ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపింది.
Telangana
Andhra Pradesh
Vijayawada
Hyderabad
TGSRTC

More Telugu News