ఏపీ, తెలంగాణకు అమిత్ షా శుభవార్త
- 2024లో ప్రకృతి వైపరీత్యాలకు ప్రభావితమైన 5 రాష్ట్రాలకు రూ. 1554.99 కోట్లు
- అమిత్ షా నేతృత్వంలో భేటీ అయిన ఉన్నత స్థాయి కమిటీ
- నిధుల మంజూరుకు ఆమోదం
- ఏపీకి రూ. 608.8 కోట్లు, తెలంగాణకు రూ. 231.75 కోట్లు
ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో భేటీ అయిన ఉన్నత స్థాయి కమిటీ ఈ నిధుల మంజూరును ఆమోదించింది. ఇక మొత్తం రూ. 1554.99 కోట్లలో ఏపీకి రూ. 608.8 కోట్లు, తెలంగాణకు రూ. 231.75 కోట్లు, త్రిపురకు రూ. 288.93 కోట్లు, ఒడిశాకు రూ. 255.24 కోట్లు, నాగాలాండ్ కు రూ. 170.99 కోట్లు ఇవ్వాలని ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది.