మమతా కులకర్ణిని బహిష్కరించిన కిన్నార్ అఖాడా
- కుంభమేళాలో సన్యాసం స్వీకరించిన మమతా కులకర్ణి
- ఆమెను మహామండలేశ్వర్ గా నియమించిన లక్ష్మీనారాయణ త్రిపాఠి
- మమత, త్రిపాఠిలను తొలగించిన కిన్నార్ అఖాడా
అయితే మమతా కులకర్ణిని మహామండలేశ్వర్ గా నియమించడం వివాదాస్పదం కావడంతో... తాజాగా ఆమెను కిన్నార్ అఖాడా నుంచి తొలగించారు. ఆమెతో పాటు ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీనారాయణను కూడా బహిష్కరించారు. కిన్నార్ అఖాడా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ వీరిద్దరిని బహిష్కరించినట్టు సమాచారం.
తన అనుమతి లేకుండా మమతకు దీక్ష అందించడం, మమతపై గతంలో డ్రగ్స్ కేసు ఉండడం వంటి కారణాలతోనే రిషి అజయ్ దాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.