మహాకుంభమేళాలో స్వచ్ఛమైన గాలి.. ఏర్పాట్లలో జపాన్ టెక్నిక్
- రెండేళ్ల క్రితమే మియవాకి టెక్నిక్ తో ప్రయాగ్ రాజ్ లో
మొక్కలు నాటిన యోగి సర్కారు - ప్రయాగ్ రాజ్ చుట్టుపక్కల ఏపుగా పెరిగిన చెట్లు
- 18 ఎకరాలలో ఏకంగా ఓ చిట్టడివి రూపుదిద్దుకుంది
అందులో భాగంగా జపాన్ టెక్నిక్ ‘మియవాకి’ను ఉపయోగించి మొక్కలు నాటారు. ప్రయాగ్ రాజ్ పరిధిలో పదిచోట్ల మొత్తం 18.50 ఎకరాల్లో ఏకంగా ఓ చిట్టడివినే తయారుచేసింది. తక్కువ ప్రదేశంలో వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటే టెక్నికే మియవాకి.. ఈ టెక్నిక్ తో మర్రి, రావి, వేప, చింత, ఉసిరి, రేగి, వెదురు.. ఇలా 63 రకాలకు చెందిన 5 లక్షలకు పైగా మొక్కలను అధికారులు నాటారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.6 కోట్లు ఖర్చుచేసింది. రెండేళ్లలో ఆ మొక్కలు చెట్లుగా ఎదిగి స్వచ్ఛమైన ఆక్సిజన్ ను వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి.