ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో మావోయిస్ట్ కీలక నేత మృతి.. అతడి తలపై రూ.కోటి రివార్డు
- కులరైఘాట్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఎదురుకాల్పులు
- 14 కు పెరిగిన ఎన్ కౌంటర్ మృతుల సంఖ్య
- భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభ్యం
ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడడం, కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. పోలీసుల కాల్పుల్లో మొత్తం 14 మంది మావోయిస్టులు చనిపోయారు. చెట్లు, పొదల పక్కన పడి ఉన్న మృతదేహాలను పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు.