Khammam District: ఖమ్మం జిల్లాలో క్రికెట్ ఆడుతూ మైదానంలో కుప్పకూలిన యువకుడు

Young boy died during cricket tournament
  • కూసుమంచి జిల్లాలో ఘటన 
  • మైదానంలో కుప్పకూలిన విజయ్ అనే యువకుడు
  • గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రకటించిన వైద్యులు
ఖమ్మం జిల్లాలో ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. దీంతో అతనిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అతడు గుండెపోటుతో మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు. జిల్లాలోని కూసుమంచి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది.

ఈ టోర్నమెంట్‌లో విజయ్ అనే యువకుడు ఒక్కసారిగా మైదానంలో పడిపోయాడు. దీంతో నిర్వాహకులు అతనిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు తెలిపారు. దీంతో టోర్నమెంట్ ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Khammam District
Cricket
Telangana

More Telugu News