కేటీఆర్ కు లంచ్ బ్రేక్ ఇచ్చిన ఈడీ అధికారులు... అరెస్ట్ పై తీవ్ర ఉత్కంఠ!
- ఫార్ములా ఈ-కార్ కేసులో ఈడీ విచారణ
- లంచ్ బ్రేక్ తర్వాత కొనసాగే విచారణ కీలకం
- సాయంత్రం 6.30 వరకు విచారణ కొనసాగే అవకాశం
మీ ఆదేశాల ప్రకారమే డబ్బులు బదిలీ అయ్యాయా? అని కేటీఆర్ ను ఈడీ అధికారులు ప్రధానంగా ప్రశ్నించినట్టు సమాచారం. మన కరెన్సీని పౌండ్స్ లోకి మార్చడంపై ప్రశ్నించినట్టు తెలుస్తోంది. లంచ్ బ్రేక్ తర్వాత జరిగే విచారణ కీలకంగా మారుతుందని సమాచారం. విచారణ తర్వాత కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా? లేదా ఇంటికి పంపించేస్తారా? అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.