పబ్లిసిటీ కోసం మీడియా ముసుగు వేసుకుంటున్నారు.. విశాల్ అభిమాన సంఘం ఆగ్రహం
- ‘మదగజరాజ’ సినిమా ఈవెంట్లో వణుకుతూ కనిపించిన విశాల్
- వీడియోలు, ఫొటోలు వైరల్ కావడంతో అభిమానుల ఆందోళన
- పుకార్లు ఆగకపోవడంపై తీవ్రంగా స్పందించిన అభిమాన సంఘం
- ఇలాంటి ఫేక్ న్యూస్ను ప్రజలు తిరస్కరించాలని కోరిన వైనం
చెన్నైలో ఇటీవల జరిగిన ‘మదగజరాజ’ సినిమా ఈవెంట్లో విశాల్ వణుకుతూ మాట్లాడటం, గుర్తుపట్టలేనంతగా ఉండటంతో అభిమానులు ఆందోళన చెందారు. ఆయనకు ఏమైందోనని ఆరా తీశారు. విశాల్ ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. తన సినిమా 11 ఏళ్ల తర్వాత విడుదల అవుతుండటంతో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా విశాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో స్పందించిన వైద్యులు విశాల్ విష జ్వరంతో బాధపడుతున్నాడని, కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని సూచిస్తూ హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. అయినా, ఆయన ఆరోగ్యంపై వార్తల ప్రవాహం ఆగకపోవడంతో ఆయన అభిమాన సంఘం ఇలా స్పందించింది.